హైదరాబాద్: ప్రొ వాలీబాల్ లీగ్లో కాలికట్ హీరోస్ శుభారంభం చేసింది. కొచ్చిలో ఆదివారం జరిగిన లీగ్ రెండో మ్యాచ్లో కాలికట్ 4-1 (15-8, 15-8, 13-15, 15-11, 15-11) సెట్ల తేడాతో చెన్నై స్పార్టన్స్పై అలవోక విజయాన్ని సాధించింది.
ఇంగ్లాండ్ ఓటమికి పీటర్సన్ మద్దతు: మండిపడుతోన్న నెటిజన్లు
ఈ విజయంతో హీరోస్ రెండు పాయింట్లు కూడా సాధించింది. కాలికట్ జట్టులో యువ ఆటగాడు అజిత్లాల్ అద్భుతంగా ఆడడంతో కాలికట్ 15-8, 15-8, 13-15, 15-11, 15-11తో సొంత ప్రేక్షకుల మధ్య అదిరిపోయే ప్రదర్శన చేసింది. అజిత్ లాల్ 14 పాయింట్ల (13 స్పైక్స్, 1 బ్లాక్)తో టాప్ స్కోరర్గా నిలిచాడు.
చెన్పై జట్టు తరుపున రూడీ వెరోఫ్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు స్కోర్ చేశాడు. తొలి రెండు సెట్లను కాలికట్ అలవోకగా నెగ్గింది. కానీ తర్వాత పుంజుకున్న చెన్నై మూడో సెట్ను కైవసం చేసుకుంది. అయితే తర్వాతి రెండు సెట్లలో మళ్లీ సత్తా చూపిన కాలికట్ మ్యాచ్ను కైవసం చేసుకుంది.
సోమవారం అహ్మదాబాద్ డిఫెండర్స్తో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ తలపడనుంది.