న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2019: క్రీడలకు అదనంగా రూ. 214 కోట్లు కేటాయింపు

Budget 2019: Khelo India, SAI gain more than Rs 200 crore

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి క్రీడలకు ప్రాధాన్యం పెంచింది. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ఆర్ధిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో క్రీడలకు రూ.2216.92 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.214.20 కోట్లు అదనంగా నిధులు కేటాయించారు.

నాణ్యమైన ఆటగాళ్ల కోసం భారత్ చింతించాల్సిన పని లేదు: ఎమ్మెస్కేనాణ్యమైన ఆటగాళ్ల కోసం భారత్ చింతించాల్సిన పని లేదు: ఎమ్మెస్కే

2018-19 బడ్జెట్‌లో క్రీడలకు రూ.2002.72 కోట్లు ఇచ్చారు. ఇందులో భారత క్రీడాప్రాథికార సంస్థ (సాయ్‌)కు అదనంగా రూ. 55 కోట్లు కేటాయించారు. సాయ్‌ పద్దు రూ. 395 కోట్ల నుంచి రూ. 450 కోట్లకు పెరిగింది. ఇక, జాతీయ క్రీడా అభివృద్ధి నిధి కేటాయింపులను ఏకంగా రూ.2 కోట్ల నుంచి రూ. 70 కోట్లకు పెంచారు.

క్రీడాకారులకిచ్చే ప్రోత్సాహకాలు, పురస్కారాల నిధులు రూ. 63 కోట్ల నుంచి రూ. 89 కోట్లకు పెరిగాయి. అయితే, జాతీయ క్రీడా సమాఖ్యల కేటాయింపులను మాత్రం రూ. 245.13 కోట్ల నుంచి రూ. 245 కోట్లకు తగ్గించారు. ఖేలో ఇండియా కోసం రూ. 50.31 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం.

Story first published: Saturday, February 2, 2019, 11:34 [IST]
Other articles published on Feb 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X