కింగ్ స్టన్: భారత్- విండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 281 పరుగు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ ఆచి తూచి ఆడి మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఇరు జట్ల మధ్య కాసేపు దోబుచులాడిన మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో ప్రేక్షకులకు ఒకింత నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ ఆసక్తిగా జరుగుతున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ కు 10 నిమిషాలు అంతరాయం ఏర్పడింది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ లలో బ్రేవో 73, శ్యామ్యూల్స్ 46 పరుగులు చేసి విజయంపై ఆశలు రేకెత్తించి భారత్ గుండెల్లో గుబులు పుట్టించారు.విండీస్ 13 ఓవర్లులో 80 పరుగులు చేయాల్సి ఉండగా బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ను రద్దు చేసి డ్రా ముగించారు. భారత్ బౌలర్లలో ఇషాంత్ వర్మ నాలుగు వికెట్లు తీసి మరో సారి తన ఫాంను చాటుకున్నాడు. కాగా భారత్ మొదటి ఇన్నింగ్సులో 201, రెండో ఇన్నింగ్సులో 269 పరుగులు చేసింది. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్సులో 190 రెండో ఇన్నింగ్సులో 202 పరుగులు చేసింది.