హైదరాబాద్: కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 'ఫిట్నెస్ ఛాలెంజ్' అంటూ ఓ ఛాలెంజ్ను మొదలుపెట్టాడో తెలియదు గానీ, ఆ తర్వాత 'గ్రీన్ ఛాలెంజ్', 'కికి ఛాలెంజ్' అంటూ సోషల్ మీడియాలో ఛాలెంజ్ల మోత మోరుమ్రోగిపోతుంది. తాజాగా #36SecPlankChallenge సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
ప్రముఖ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ బజాజ్ అలియాజ్ గ్రూప్ ఈ కొత్త ఛాలెంజ్కు శ్రీకారం చుట్టింది. అంతేకాదు ఈ ఛాలెంజ్ స్వీకరించి, వీడియోలు పోస్ట్ చేస్తే గుండె జబ్బుల బాధపడే చిన్నారులకు ఆర్థిక సాయం చేసిన వారవుతారని సందేశాన్ని సైతం జోడించింది. దీంతో ఈ ఛాలెంజ్ స్వీకరించేందుకు చాలామంది సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు.
ఈ ఛాలెంజ్లో 36 సెకన్ల పాటు శరీర బరువును మోచేతులపై, అరికాళ్లపై మోస్తూ పడుకోవాల్సి ఉంటుంది. మోచేతులు, అరికాళ్లు తప్ప శరీరం నేలను తాకకూడదు. ఈ ఛాలెంజ్ పూర్తిచేసి బాడీ ఫిట్నెస్ను కూడా నిరూపించుకోవచ్చని ఛాలెంజ్కు శ్రీకారం చుట్టిన బజాజ్ అలియాజ్ గ్రూప్ నిర్వాహకులు చెబుతున్నారు.
తాజాగా ఈ ఛాలెంజ్ను భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్వీకరించింది. తన ఇంట్లోనే ఈ ఛాలెంజ్ను స్వీకరించిన సైనా నెహ్వాల్ ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్లో పోస్టు చేస్తూ... బ్యాడ్మింటన్ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్లతో పాటు కేంద్రమంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్లకు సవాల్ విసిరింది.
Let’s make the world a healthy place by participating in #36SecPlankChallenge.Join me for this good cause. Plank for 36 seconds and @BajajAllianzLIC will contribute towards curing heart disorders of disadvantaged children.
— Saina Nehwal (@NSaina) September 12, 2018
I challenge @parupallik , @Ra_THORe sir , @PRANNOYHSPRI pic.twitter.com/lHdTDgf3Zg
కాగా, భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అక్షత కూడా ఈ ఛాలెంజ్ను స్వీకరించింది. "ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. ప్రతీరోజు సరిహద్దులను చెరిపివేసేందుకు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. సైనా నెహ్వాల్, బజాజ్ అలియాజ్ ఆలోచన అద్భుతం" అంటూ ట్వీట్ చేసింది.
Maintaining fitness is extremely important. We need to push ourselves daily to keep breaking boundaries. Wonderful initiative @NSaina @BajajAllianzLIC. Here’s my #36SecPlankChallenge! #Gymnast #gymnastics #Fitness #Plank #india #sports #workout #gym #fridayfeeling #motivation pic.twitter.com/tbl1BzOoCn
— Akshata_gymnast (@akshatashete) September 14, 2018
కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత గీతా ఫోగట్ కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించింది. తన వీడియోని ట్విట్టర్లో పోస్టు చేసి భాలీవుడ్ నటి పాపీ జబ్బల్, మోనిక డోగ్రాలతో పాటు కబడ్డీ ప్లేయర్ అనూప్ కుమార్లను ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా సవాల్ విసిరింది.
#36SecPlankChallenge is an inspiring initiative by @BajajAllianzLIC towards curing heart disorders of underprivileged children. I accept the #36SecPlankChallenge and challenge @poppyjabbal3 @IamAnupK @MonicaSDogra Post your videos or picture and nominate your family & friends. pic.twitter.com/9FEBv7cLPD
— geeta phogat (@geeta_phogat) September 14, 2018