టోక్యో: టోక్యో ఒలింపిక్స్ 2021లో ఆస్ట్రేలియా ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. ఆస్ట్రేలియా వుమెన్స్ ఫ్రీస్టైల్ రిలే స్విమ్మింగ్ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 4×100 మీటర్ల రిలే టీమ్ పతాకాన్ని గెలవడమే కాకుండా ప్రపంచ రికార్డ్ కూడా నెలకొల్పింది. ఈ ఈవెంట్లో ఆస్ట్రేలియాకు గోల్డ్ మెడల్ రావడం ముందే ఖాయమైనా.. చివరికి సొంత రికార్డును కూడా బద్ధలుకొట్టి ఆ టీమ్ గెలిచింది. ఇంతకుముందు జరిగిన రెండు ఒలింపిక్ గేమ్స్లోనూ ఆస్ట్రేలియా ఖాతాలోనే గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.
Tokyo Olympics 2021: టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్కు షాక్.. తొలి రౌండ్లోనే ఇంటిదారి!!
2018లో తాము క్రియేట్ చేసిన ప్రపంచ రికార్డును ఇప్పుడు ఆస్ట్రేలియా అధిగమించింది. బ్రాంట్ క్యాంప్బెల్, మెగ్ హ్యారిస్ తొలి రెండు లెగ్స్లో మంచి ఆరంభం ఇవ్వగా.. మూడో లెగ్లో ఎమ్మా మెక్కియోన్ రికార్డు స్విమ్ ఆస్ట్రేలియాకు ఈ రికార్డు కట్టబెట్టింది. చివరి లెగ్లో కేట్ క్యాంప్బెల్ కూడా అదే స్పీడు కొనసాగించడంతో ఈ రిలేను 3:29.69 నిమిషాల్లో ఆస్ట్రేలియా టీమ్ పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. కెనడా (3:32.78) మరియు యుఎస్ఎ (3:32:81) కంటే ముందు ఆస్ట్రేలియా రిలేను ముందుగా పూర్తిచేసింది.
ఇక టోక్యో ఒలింపిక్స్ రోయింగ్ విభాగంలో భారత్ శుభారంభం చేసింది. పురుషుల లైట్వెయిట్ డబుల్ స్కల్స్ రెపికేజ్లో రోవర్స్ అర్జున్ లాల్-అర్వింద్ సింగ్ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ జోడి టాప్-3లో నిలవడంతో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. జులై 27న ఈ పోటీలు జరగనున్నాయి. మరోవైపు మహిళల 10 మీ ఎయిర్పిస్టల్ విభాగంలో భారత్కు నిరాశ ఎదురైంది. మనుబాకర్, యశస్విని 12 వ స్ధానంలో నిలిచారు. దీంతో భారత్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది.