హైదరాబాద్: రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్స్ షిప్లో పతకం ఖాయం చేసింది. శుక్రవారం మహిళల 60 కిలోల విభాగంలో కజకిస్థాన్కు చెందిన అయౌలిమ్ కసిమోవాను ఓడించి ఫైనల్స్కు చేరింది.

రియో ఒలింపిక్స్లో పతకం సాధించి సుమారు ఏడాది తర్వాత మ్యాట్లోకి అడుగుపెట్టిన సాక్షి మాలిక్ 15-3 తేడాతో విజయం సాధించి ఫైనల్స్లో అడుగుపెట్టింది. కాగా, ఫైనల్స్లో సాక్షి ఒలింపిక్ స్వర్ణ పతక విజేత రిసాకో కవాయి (జపాన్)తో తలపడనుంది.
రియో ఒలింపిక్స్లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన సాక్షి ఒలింపిక్స్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో రజతం, 2015 ఆసియా క్రీడల్లో సాక్షి కాంస్యం గెలిచింది.