
ఆసియన్ గేమ్స్
ఆసియా క్రీడల ఆర్చరీ విభాగంలో శనివారం భారత్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఆర్చరీ విభాగంలో తొలిసారిగా భారత్ స్వర్ణ పతకం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో దక్షిణ కొరియాపై 227-225 పాయింట్ల తేడాతో భారత బృందం (రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మ) విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది.

ఆసియన్ గేమ్స్
ఇది ఇలా ఉండగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో భారత్కు కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ(విజయవాడ), త్రిష డే, పూర్వా, షిండే ఆర్చరీ జట్టు కాంస్యం సాధించింది.

ఆసియన్ గేమ్స్
శుక్రవారం భారత్ మరో రెండు పతకాలను సాధించింది. షూటింగ్లో రజత పతకం లభించగా, స్విమ్మింగ్లో కొనసాగుతున్న ఫ్లాప్ షోకు తెరదించుతూ సందీప్ సెజ్వాల్ కాంస్య పతకం సాధించాడు.

ఆసియన్ గేమ్స్
24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, నాలుగేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో విర్ధావల్ ఖాడే ఈత కొలనులో ఒక పతకాన్ని అందుకోగా, ఈసారి సెజ్వాల్ పతకాన్ని అందించాడు.

ఆసియన్ గేమ్స్
గాంగ్జూ ఏషియాడ్లో విర్ధావల్కు 50 మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో కాంస్య పతకం లభించింది.

ఆసియన్ గేమ్స్
మొత్తం మీద ఈ క్రీడాంశంలో శుక్రవారం నాటికి భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్య పతకాలు దక్కాయి.


Click it and Unblock the Notifications











