

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. బుధవారం పోటీల్లో భాగంగా ట్రింపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ భారత్కు పదో స్వర్ణం అందించగా... ఆ తర్వాత జరిగిన మహిళల హెప్టాథ్లాన్ పోటీల్లో స్వప్న బర్మన్ మరో స్వర్ణాన్ని సాధించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
అథ్లెటిక్స్లోనే ఎంతో కఠినమైన ఈవెంట్గా పేర్కొనే ఈ హెప్టాథ్లాన్లో స్వప్న బర్మన్ 6026 పాయింట్లతో ముగించడంతో స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఏడు రకాల ఈవెంట్లను హెప్తథ్లాన్లో భాగంగా నిర్వహిస్తారు. తాజా పతకంతో భారత ఖాతాలో స్వర్ణ పతకాల సంఖ్య 11కి చేరుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 11 స్వర్ణం, 20 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.