
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పురుషుల వుషు సందా 56 కేజీల విభాగంలో భారత్కు చెందిన సంతోష్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. తాజా పతకంలో ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరింది.
ఇప్పటివరకు భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. వుషు విభాగంలో భారత్కు ఇది రెండో పతకం కావడం విశేషం.
ఇదిలా ఉంటే, వుషు విభాగంలో భారత్ మొత్తం నాలుగు పతకాలను సాధించింది. బుధవారమే వుషు విభాగంలో భారత క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.