
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పురుషుల వుషు సందా 65 కేజీల విభాగంలో భారత్కు చెందిన నరేందర్ గ్రెవాల్ కాంస్య పతకం సాధించాడు.
సెమీపైనల్ బౌట్లో ఫోరౌడ్ జఫారీ చేతిలో ఓడినప్పటికీ నరేంద్ర గ్రెవాల్ కాంస్య పతకాన్ని దక్కించుకోవడం విశేషం. తాజా పతకంలో ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8కాంస్యాలు ఉన్నాయి.
వుషు విభాగంలో భారత్కు ఇది నాలుగో పతకం కావడం విశేషం. ఒక్క బుధవారమే వుషు విభాగంలో భారత క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.