జకార్తా: ప్రతిష్టాత్మకమైన క్రీడా సంరంభం ఆసియా గేమ్స్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఈ క్రమంలోనే సెయిలింగ్ (పురుషుల)విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న వరుణ్ థక్కర్, గణపతి చెంగప్పలు కాంస్యాలు దక్కించుకున్నారు. సెయిలింగ్ విభాగంలోని ఓపెన్ లేజర్ సైలింగ్ ఈవెంట్లో హర్షిత థోమర్ కాంస్యాన్ని గెలుచుకున్నారు. అంతకంటే ముందు వర్ష గౌతమ్, శ్వేతా షేర్వాగర్ల జోడి కలిసి రజతం సంపాదించింది. ఇది భారత్కు 60వ పతకం, కాగా తర్వాతి రెండు పతకాలు కూడా ఇదే విభాగంలో రావడం విశేషం.
అంతకంటే ముందు భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలతో జాబితాలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది.