
జకార్తా: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అదరగొడుతోంది. రెండు రోజుల క్రితం ఆతిథ్య ఇండోనేషియాను 17-0తో ఓడించిన టీమ్ఇండియా.. బుధవారం రికార్డు విజయాన్ని నమోదు చేసింది. నిమిషానికో గోల్ అనే రీతిలో భారత ఆటగాళ్లు..పసికూన హాంకాంగ్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. బుధవారం పూల్-బిలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 26-0 తేడాతో హాంకాంగ్పై భారీ విజయాన్ని చేజిక్కుంచుకుంది. ఈ క్రమంలో 86 ఏళ్ల రికార్డును శ్రీజేష్సేన చెరిపివేసింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఇంతటి చారిత్రక విజయానికి అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభినందనలు అందజేస్తున్నారు.
'భారత పురుషుల జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. నిర్ధాక్షిణ్యంగా హాంగ్కాంగ్ జట్టును కూల్చేసింది. 26 పరుగులు చేసి ప్రత్యర్థిని సున్నా దగ్గరే ఆపేసింది. 86ఏళ్ల చరిత్రను బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్ను చూడటం చాలా నైస్గా అనిపించింది. ఇలాంటి ఆటతీరునే టోర్నమెంట్ చివరివరకూ కొనసాగించాలని కోరుకుంటున్నా'
ఒక్క మ్యాచ్లోనే హాంగ్కాంగ్ చైనాను 26-0తో కూల్చి పారేసింది టీమిండియా.
భారత హాకీ చరిత్ర సృష్టించింది. హాంగ్కాంగ్ను 26-0తేడాతో ఓడించింది. ఇంతటి తేడాతో గెలుపొందడం ఇదే తొలిసారి.