
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. శనివారం పోటీల్లో భాగంగా భారత్ స్క్వాష్లో తొలి పతకం సాధించింది. స్క్వాష్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన దీపికా పల్లికల్ కాంస్య పతకం సాధించింది.
సెమీస్లో భాగంగా మలేసియాకు చెందిన నికోల్ డేవిడ్తో తలపడిన దీపికా పల్లికల్ 0-3తో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత పతకాల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం భారత ఖాతాలో 6 స్వర్ణ, 5 రజత, 15 కాంస్య పతకాలు ఉన్నాయి.