For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: మాజీ ప్రధాని వాజపేయికి అదే సరైన నివాళి

By Nageshwara Rao
Asian Games 2018: Best way to pay respect to late Atal Bihari Vajpayee is by winning medals in Jakarta, says Indias Chef de Mission

జకార్తా: అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరగబోయే ఆసియా గేమ్స్‌లో గెలవబోయే పతకాలన్నింటినీ ఆయనకు అంకితమివ్వనున్నారు. ఈ మేరకు ఆసియా గేమ్స్ సీడీఎం బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ శుక్రవారం స్పష్టం చేశారు.

18వ ఆసియా గేమ్స్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఇండోనేషియా వేదికగా శనివారమే ఈవెంట్‌ ప్రారంభం కానుంది. 45 దేశాల నుంచి 10 వేలకు మందిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో ఉన్నారు. భారత్‌ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యారు.

వీరిలో 311 మంది పురుషులు, 260 మంది మహిళలు ఉన్నారు. తొలిరోజైన శనివారం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆదివారం నుంచి పోటీలు మొదలవుతాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు సాధించిన అన్ని పతకాలను అటల్‌జీకి అంకితమివ్వాలని నిర్ణయించుకున్నాం. దేశం గర్వించదగ్గ వ్యక్తికి ఇదే మేమిచ్చే నివాళి" అని అన్నారు.

భారతీయ అథ్లెట్లందరూ అక్కడ వాజ్‌పేయీకి నివాళులర్పిస్తున్న ఫొటోను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) ఈ సందర్భంగా ట్వీట్‌ చేసింది. ఆసియా గేమ్స్‌‌లో భాగంగా భారతీయ అథ్లెట్లు, కోచ్‌లు ఇప్పటికే జకార్తా చేరుకున్నారు. షూటింగ్‌, హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో మనకు పతకాలు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Story first published: Saturday, August 18, 2018, 9:50 [IST]
Other articles published on Aug 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+