
జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడా సంరంభంలో షూటర్లు తమ సత్తా చాటుతున్నారు. భారత్ నుంచి మరో షూటర్ లక్ష్యయ్ షెరోన్ వెండి పతకం సాధించాడు. ఈ 19ఏళ్ల యువ షూటర్ ఫైనల్కు మెరుగైన స్థాయిలో అర్హత సాధించి 43/50 స్కోరుతో రౌండ్ ముగించాడు. ఈ పోటీలోనూ చైనాకు చెందిన యాంగ్ కుంపీ తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఆసియా క్రీడల్లో భారత్కు ఇది రెండవ సిల్వర్ మెడల్ కావడం విశేషం. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో షూటర్ మానవ్జీత్ సందూ నాలుగవ స్థానంలో నిలిచాడు. మెన్స్ ట్రాప్ ఫైనల్లో 48 టార్గెట్లకు గాను లక్షయ్య మొత్తం 42 టార్గెట్లను ఫినిష్ చేశాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం