Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆమెను ఒలింపిక్స్‌లో చూడాలి.. ఎంతైనా ఖర్చు పెడతా'

Anand Mahindra offers financial support to sprinter Hima Das

హైదరాబాద్: భారత్‌లో క్రీడాకారులకు మంచి రోజులు వచ్చినట్లుగా ఉంది. కొద్ది రోజుల ముందే ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన 400మీ పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచింది హిమ దాస్. అయితే శుభాకాంక్షల వెల్లువే కానీ, ప్రోత్సాహకాలేమీ లేవంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటికి ఆనంద్ మహీంద్రా స్పందించారు.

ప్రపంచ అండర్-20 ఛాంపియన్‌‌షిప్‌లో స్వర్ణపతకం సాధించిన స్ప్రింటర్ హిమదాస్‌కు ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహీంద్రా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'ఇప్పుడు ప్రతీ ఒక్కరూ హిమదాస్‌ను ఒలింపిక్ పోడియంపై చూడాలనుకుంటున్నారు. ఇందుకోసం రాజ్యవర్ధన్ రాథోర్, అథ్లెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమెకు సరైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకవేళ ప్రభుత్వ నిధులే కాకుండా.. ఆమెకు ఎలాంటి ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినా.. సాయం చేసేందుకు నేను ఎప్పుడు సిద్ధమే' అని ట్వీట్ చేశారు.

ఆనంద్ తీసుకున్నా ఈ నిర్ణయంపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. అసోమ్లోని ఓ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో జన్మించిన హిమ ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన 400 మీటర్ల ఈవెంట్‌ని 51.46 సెకన్ల టైంలో ముగించింది. దీంతో ఆమెపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ ఘనత సాధించి తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చిన హిమకు అసోమ్ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆమెకు రూ.50 లక్షల నజరానా ప్రకటించారు.

రెండురోజుల క్రితం అసోమ్ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర శ్రీ సిద్ధార్థ అకాడమీ తరఫున 10 లక్షలు నజరానా ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Story first published: Tuesday, July 17, 2018, 10:30 [IST]
Other articles published on Jul 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+