
ఎంతోమంది స్వాగతం పలికారు
ఆసియా కప్ ముగించుకుని తన స్వగ్రామానికి తిరిగొచ్చాక తనకు ఎంతోమంది స్వాగతం పలికారని స్వప్న పేర్కొంది. "‘నాకోసం ఏడుస్తారన్న కనీస ఆలోచన నాకు లేదు. కానీ మా అమ్మ ఏంతగానో ఏడ్చింది. ఓ ఏడాది వరకు నేను ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం నా జీవితం మారిపోయింది. నేను మారలేదు" అని తెలిపింది.

అంతా కలగా అనిపిస్తోంది
"ప్రజలు నన్ను చూసే తీరు పూర్తిగా మారిపోయింది. దీని గురించెప్పుడూ ఆలోచించలేదు. అంతా కలగా అనిపిస్తోంది. నేను నిద్రపోతున్నానా?" అని స్వప్న బర్మన్ వెల్లడించింది. ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం టోక్యో వేదికగా 2020లో జరిగే ఒలింపిక్స్లో మంచి ప్రదర్శన చేయడమే అని చెప్పుకొచ్చింది.

నిరుపేద కుటుంబంలో జన్మించిన స్వప్న బర్మన్
స్వప్న బర్మన్ నేపథ్యంలోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్ గురి ప్రాంతంలో 1996, అక్టోబర్ 29న ఒక గిరిజన తెగకు చెందిన పంచానన్ బర్మన్, బసాన దంపతులకు జన్మించింది. స్వప్నది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా కార్మికుడు, తల్లి తేయాకు తోటలో పనిచేసే దినసరి కూలీ. ఆమె పాదాలకు ఆరు చొప్పున 12 వేళ్లు ఉంటాయి.

ప్రత్యేక బూట్లను అందుకోనున్న స్వప్న బర్మన్
అందుకు అనువైన షూ సైతం దొరకదు. అయితే, ఆసియా గేమ్స్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన స్వప్న బర్మన్ త్వరలో ప్రత్యేక బూట్లను అందుకోనుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఆమె కోసం ప్రత్యేకమైన బూట్లు తయారు చేయించి ఇచ్చేందుకు గాను ప్రముఖ బూట్ల తయారీదారు కంపెనీ ఆడిడాస్తో ఒప్పందం చేసుకుంది.


Click it and Unblock the Notifications












