హైదరాబాద్: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరుగుతున్న ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత ఆర్చర్ల జోడీ వెన్నం జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ రజత పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన ఫైనల్లో వెన్నం జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ జోడీ రన్నరప్గా నిలిచింది.
మిక్స్డ్ కాంపౌండ్ విభాగం ఫైనల్లో సురేఖ, వర్మ జోడీ 153-157 తేడాతో కొరియా జంట చావోన్, జాన్హో చేతిలో ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన స్వర్ణ పతక పోరులో తొలి సెట్ 39-39తో సమం కాగా, రెండో సెట్ను 39-38తో కొరియా కైవసం చేసుకుంది.
మరోవైపు కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంది. జ్యోతి సురేఖ, ప్రవీణ, తిష్రావిల్లితో కూడిన మహిళల కాంపౌండ్ జట్టు కూడా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.