
జకార్తా: ఆసియా క్రీడా సంరంభంలోని మూడో రోజు భారత్ స్వర్ణంతో ఖాతా తెరిచిన జాబితాలో మరో పతకం వచ్చి చేరింది. స్వర్ణాన్ని గెలిచిన సౌరబ్ చౌదరీతో పాటుగా ఫైనల్కు అర్హత సాధించిన అభిషేక్ వర్మ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకూ భారత్ 3 స్వర్ణాలు, 2 రజితాలు, 2 కాంస్యాలను దక్కించుకుంది. భారత్కు ఇది ఏడో పతకం. అయితే ఇప్పటివరకూ భారత్ సాధించిన పతకాల్లో 5 షూటింగ్లోనే కావడం గమనార్హం.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
తొలి రోజు నుంచే ఆధిక్యంలో కొనసాగుతున్న మహిళా కబడ్డీ జట్టు కూడా ప్రత్యర్థి ఆతిథ్య ఇండోనేషియాను చిత్తు చేసి ఆధిక్యంలో దూసుకెళ్తోంది.