
జకార్తా: ఆసియా క్రీడా సంరంభంలో భారత్కు మరో పతకం చేజిక్కింది. 10మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరవ్ చౌదరీ స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. అభిషేక్ వర్మ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో ఫైనల్స్కు అర్హత సాధించిన భారత షూటర్లు అభిషేక్ వర్మ.. సౌరవ్ చౌదరి దాదాపు ఇరువురికి పతకం ఖాయమనుకుంటున్న తరుణంలో సౌరవ్ చౌదరి విఫలమైయ్యాడు.
240.7 పాయింట్లతో సౌరభ్ ఏషియాడ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. జపాన్కు చెందిన తొమొయుకి మత్సుదా 239.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. గత జూన్లో జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్లో సౌరభ్ చౌధురీ స్వర్ణం గెలవడంతోపాటు 243.7 పాయింట్లతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు అపూర్వీ చండేలా-రవి కుమార్ జోడి కాంస్యంతో భారత్కు తొలి పతకాన్ని అందించగా.. భజరంగ్ పసిడి పతాకాన్ని గెలుపొందాడు. మరో షూటర్ దీపక్ కుమార్ రెండో రోజు రజత పతకం గెలుపొందాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం