టోక్యో: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 16 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు లక్ష మంది మృత్యువాత పడ్డారు. ఇక మహమ్మారి కారణంగా ప్రపంచ క్రీడా క్యాలెండర్ గందరగోళంలో పడింది. ఇప్పటికే ఎన్నో టోర్నీలు రద్దు కాగా.. మరికొన్ని టోర్నీలు వాయిదా పడ్డాయి. ఈ మహమ్మారి జపాన్లోనూ పంజా విసురుతోంది. తాజాగా జపాన్ సుమో రెజ్లర్కు కరోనా పాజిటివ్ అని తేలింది.
మొబైల్ సిగ్నల్ కోసం చెట్లెక్కుతున్న ఐసీసీ అంపైర్!!
జపాన్ సుమో రెజ్లర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. జపాన్ సుమో అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించింది. రెజ్లర్ ఆటగాళ్లలో మొట్టమొదటి పాజిటివ్ కేసు ఇదే అని తెలిపింది. అయితే జపాన్ సుమో అసోసియేషన్ అతని పేరును మాత్రం వెల్లడించలేదు. గత శనివారం అతనికి తీవ్ర జ్వరం వచ్చింది అయినా అధికారులు కరోనా లక్షణాలు ఉన్నాయని ఫిర్యాదు చేయలేదు. రెజ్లర్కు కరోనా సోకడంతో వచ్చే నెల సమ్మర్ గ్రాండ్ సుమో టోర్నమెంట్ వాయిదా వేశారు. మే 24 న కొత్త ప్రారంభ తేదీని ప్రకటిస్తుంది.
ఇటలీ ప్రొషెషనల్ అసోసియేషన్ ఫుట్బాల్ క్లబ్ జట్లలో ఒకటైన జువెన్టస్ జట్టు సభ్యుడు, అర్జెంటీనా ఆటగాడు పౌలో డైబాల సైతం కరోనాతో పోరాడాడు. ఈ క్లబ్ తరఫున ఆడే ఆటగాళ్లలో డానియెల్ రుగాని, బ్లాసి మాటుడిలో కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకున్న 26 ఏళ్ల డైబాల.. కరోనా వైరస్ తనను ఎంతలా బాధించిందనే అనుభవాలను ఇటీవలే పంచుకున్నాడు.
అట్లెటికొ పొర్టాడ అల్టా జట్టుకు కోచ్గా పనిచేస్తున్న 21 ఏళ్ల ఫ్రాన్సిస్కో గార్సియాకు కరోనా వైరస్ సోకడంతో గత నెలల్లో మృతిచెందాడు. అతడు లుకేమియాతో కూడా బాధపడ్డాడనిసమాచారం. కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో ఫ్రాన్సిస్కోను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫ్రాన్సిస్కో మృతి చెందాడు. అయితే అతని వయసు కేవలం 21 ఏళ్లు కావడం విశేషం.