
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో బుధవారం తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్ మధ్య చివరి నిమిషం దాకా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ 32-32తో డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలో 19-15తో హరియాణా పైచేయి సాధించినప్పటికీ.. ద్వితీయార్ధంలో తలైవాస్ పుంజుకుంది. 27-27 వద్ద ఆ జట్టు స్కోరు సమం చేసింది. ఒక దశలో తలైవాస్ 31-29తో విజయానికి చేరువగా వెళ్లింది.
ఐతే చివరి 3 నిమిషాల్లో స్టీలర్స్ చక్కటి ప్రదర్శనతో స్కోరు సమం చేసింది. తలైవాస్ జట్టులో సుఖేశ్ (7 పాయింట్లు), అజయ్ ఠాకూర్ (6) రాణించగా.. హరియాణా తరఫున వికాస్ (14) అదరగొట్టాడు.
హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో ప్రథమార్ధంలో బుధవారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 32-29తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. ముంబా 17-6తో ఆధిక్యంలో నిలవగా.. రెండో అర్ధంలో బుల్స్ పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. కానీ చివరికి విజయం ముంబానే వరించింది. దర్శన్ 9 రైడ్ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ముంబా జట్టులో దర్శన్ (9), సురేందర్ (5), ఫజల్ (5) రాణించారు. బెంగళూరు తరఫున పవన్ (8), రోహిత్ (6), కాశిలింగ్ (4) మెరిశారు. తమిళ్ తలైవా్స-హరియాణా స్టీలర్స్ మధ్య జరిగిన మ్యాచ్ 32-32తో టైగా ముగిసింది.