ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన తెలుగు టైటాన్స్
మరో ఆటగాడు రోహిత్ రాణా (3) ట్యాకిలింగ్లో సత్తా చాటాడు. తమిళ్ తలైవాస్ జట్టులో అజయ్ ఠాకూర్ (20 పాయింట్లు) అద్భుతంగా రైడింగ్ చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన తెలుగు టైటాన్స్ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేసింది.
మూడుసార్లు తమిళ్ జట్టుని ఆలౌట్ చేసిన టైటాన్స్
మూడుసార్లు తమిళ్ జట్టుని ఆలౌట్ చేసింది. ఒకానొక దశలో 11-7తో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్.. రాహుల్ సత్తా చాటడంతో 20-9తో తిరుగులేని ఆధిక్యానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో తమిళ తలైవాస్ డిఫెన్స్ దారుణంగా విఫలమైంది. రెండో అర్ధభాగంలో తమిళ్ తలైవాస్ కెప్టెన్ అజయ్ రాణించడంతో 33-46తో పుంజుకున్నట్లే కనిపించింది.
చివర్లో రాహుల్ వరుస పాయింట్లు
అయితే అప్పటికే తెలుగు టైటాన్స్ గెలుపు ఖాయమైంది. చివర్లో రాహుల్ వరుస పాయింట్లు సాధించడంతో టైటాన్స్ తన విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చ్యున్ జెయింట్స్ 42-22తో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. సచిన్ 10 రైడ్ పాయింట్లు సాధించి గుజరాత్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ప్రొ కబడ్డీలో బుధవారం
యు ముంబా × హర్యానా స్టీలర్స్ (రా.8 నుంచి)
తమిళ్ తలైవాస్ × యూపీ యోధ (రా. 9 నుంచి)
స్టార్స్పోర్ట్స్-2లో