గెలుపు దరిదాపుల్లో బోల్తా
ఇప్పటివరకు ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8లో తెలుగు టైటాన్స్ 7 మ్యాచ్లు ఆడింది. ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఏకంగా 5 మ్యాచ్ల్లో ఓడింది. రెండు మ్యాచ్లను టైగా ముగించింది. అయితే ఓడినా 4 మ్యాచ్లతోపాటు టైగా ముగిసిన రెండు మ్యాచ్ల్లో విజయవకాశాలు టైటాన్సే వైపే ఉన్నప్పటికీ చివర్లో తొందరపాటుతో చేసిన తప్పులతో టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటివరకు విజయం అందని ద్రాక్షగా మారింది. దీంతో తెలుగు టైటాన్స్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
రెండు మ్యాచ్లు టై
ఈ సీజన్ను తెలుగు టైటాన్స్ టై తో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో తమిళ్ తలైవస్తో తలపడిన టైటాన్స్ మ్యాచ్ను 40-40తో టైగా ముగించింది. అలాగే జనవరి 1న బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్ను కూడా టైటాన్స్ 34-34తో టైగా ముగించింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఆయా జట్లతో టైటాన్స్ నువ్వా నేనే అన్నట్టుగా పోరాడింది. అయితే చివరి నిమిషంలో చేసిన తప్పులతో విజయాన్ని అందుకోలేకపోయింది.
నాల్గింట్లో విజయం దరిదాపుల్లోకి వచ్చి ఓటమి
రెండు మ్యాచ్లను టైగా ముగించిన తెలుగు టైటాన్స్ మరో 5 మ్యాచ్ల్లో ఓడింది. ఇందులో నాలుగు మ్యాచ్ల్లో విజయానికి అత్యంత చేరువగా వచ్చి ఓడిపోయింది. పుణేరి పల్టాన్తో జరిగిన మ్యాచ్లో 33-34 తేడాతో, హర్యాణా స్టీలర్స్తో 37-39తో, పాట్నా పైరేట్స్తో 30-31తో, దబాంగ్ ఢిల్లీతో 35-36తో తెలుగు టైటాన్స్ తుదిలో ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. ఇక యు ముంబాతో 48-38తో చిత్తుగా ఓడింది. కాగా తెలుగు టైటాన్స్ తదుపరి మ్యాచ్ను ఈ నెల 11న గుజరాత్ జెయింట్స్తో ఆడనుంది.
అట్టడుగున టైటాన్స్
ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున 12వ స్థానంలో ఉంది. టైటాన్స్ ఖాతాలో కేవలం 10 పాయింట్లు ఉన్నాయి.