స్మిత్ను ఎగతాళి చేసిన ఇంగ్లీషు అభిమానులపై ఆసీస్ ప్రధాని మండిపాటు
19వ ర్యాంకు ఆటగాడైన సాయి ప్రణీత్ కెనడాకు చెందిన 66వ ర్యాంకు ఆటగాడు ఆంథోనీ హో షూపై 21-17, 21-16 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించాడు. మరో పురుషుల సింగిల్స్ పోరులో మరో షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ గెలుపు కోసం పోరాడాల్సి వచ్చింది.
ఫిన్లాండ్కు చెందిన 93వ ర్యాంకర్ యూటు హీనోపై 17-21, 21-10, 21-11 తేడాతో నెగ్గాడు. తొలి గేమ్ చేజార్చుకున్న ప్రణయ్ ఆ తర్వాత రెండు గేముల్లో తన అనుభవాన్ని ఉపయోగించి గేమ్లతో పాటు మ్యాచ్ని కూడా సొంతం చేసుకున్నాడు.
56 బంతుల్లో సెంచరీ: 28 ఏళ్ల వరకూ చెక్కు చెదరని రికార్డు
ఇక, మహిళల డబుల్స్లో మేఘనా జక్కంపూడి, పూర్వీషా రామ్ 21-10, 21-18 తేడాతో గ్వాటెమాల జోడీ డయానా కార్లెటో, నిక్తె అల్గెజాండ్రపై విజయం సాధించారు. ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్, పదో సీడ్ సమీర్ వర్మ పురుషుల సింగిల్స్లో పోటీ పడాల్సి ఉంది.