For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలిరోజు మెరిశారు: రెండో రౌండ్‌లోకి సాయి ప్రణీత్, ప్రణయ్

Sai Praneeth, Prannoy make winning start at World Championships
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత షట్లర్లు మెరిశారు. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

19వ ర్యాంకు ఆటగాడైన సాయి ప్రణీత్‌ కెనడాకు చెందిన 66వ ర్యాంకు ఆటగాడు ఆంథోనీ హో షూపై 21-17, 21-16 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించాడు. మరో పురుషుల సింగిల్స్ పోరులో మరో షట్లర్‌ హెచ్ ఎస్ ప్రణయ్‌ గెలుపు కోసం పోరాడాల్సి వచ్చింది.

ఫిన్లాండ్‌కు చెందిన 93వ ర్యాంకర్ యూటు హీనోపై 17-21, 21-10, 21-11 తేడాతో నెగ్గాడు. తొలి గేమ్‌ చేజార్చుకున్న ప్రణయ్ ఆ తర్వాత రెండు గేముల్లో తన అనుభవాన్ని ఉపయోగించి గేమ్‌లతో పాటు మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకున్నాడు.

56 బంతుల్లో సెంచరీ: 28 ఏళ్ల వరకూ చెక్కు చెదరని రికార్డు

ఇక, మహిళల డబుల్స్‌లో మేఘనా జక్కంపూడి, పూర్వీషా రామ్‌ 21-10, 21-18 తేడాతో గ్వాటెమాల జోడీ డయానా కార్లెటో, నిక్తె అల్గెజాండ్రపై విజయం సాధించారు. ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌, పదో సీడ్‌ సమీర్‌ వర్మ పురుషుల సింగిల్స్‌లో పోటీ పడాల్సి ఉంది.

Story first published: Monday, August 19, 2019, 19:39 [IST]
Other articles published on Aug 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+