మాంట్రియల్: రోజర్స్ కప్ సెమీ ఫైనల్లో బోపన్న జోడీకి నిరాశే ఎదురైంది. వరుస సెట్లలో ఓడిపోయి బోపన్న జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కెనడా వేదికగా జరగుతున్న ఏటీపీ మాస్టర్స్ 1000 మాంట్రియల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా రోహన్ బోపన్న (భారత్) - డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ పురుషుల డబుల్స్ సెమీస్లో ఓటమి పాలైంది.
డచ్ జోడీ రాబిన్ హాస్-వెస్లీ కూల్హోఫ్ చేతిలో బోపన్న జోడీ 6-7 (3-7), 6-7 తేడాతో ఓడింది. 90 నిమిషాలకు పైగా హోరాహోరీగా సాగిన ఈ పోరులో అన్సీడెడ్ బోపన్న ద్వయం వరుస సెట్లలో ఓడింది. దీంతో రాబిన్- హస్లీ జోడీ ఫైనల్కు చేరింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో మార్సెల్-హోరాసియా ద్వయంతో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో బెనోయిట్ పెయిర్-వావ్రింకా వాకొవర్ ఇవ్వడంతో బోపన్న జోడీ సెమీస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Just in: Rohan Bopanna/Denis Shapovalov through to Semis of Montreal Masters after gettimg walkover over Stan Wawrinka/Benoit Paire. #RogersCup pic.twitter.com/0C1nY6TpFd
— India_AllSports (@India_AllSports) August 9, 2019
సెమీస్ ఫైనల్ ముందు వరకు కూడా రోహన్ బోపన్న-డెనిస్ షపోవలోవ్ జోడీ మంచి ప్రదర్శన చేసింది. 16వ రౌండ్లో కైల్ ఎడ్మండ్-టేలర్ ఫ్రిట్జ్లను వరుస సెట్లలో బోపన్న జోడి ఓడించింది. అంతకుముందు బోపన్న-షపోవలోవ్ జోడీ నాల్గవ సీడ్ ఫ్రెంచ్ ద్వయం నికోలా మహుత్-ఎడ్వర్డ్ రోజర్లను ఓడించారు. కానీ.. దురదృష్టవశాత్తు సెమీస్లో పోరాడినా ఫలితం లేకపోయింది.