డిఫెండింగ్ ఖాతాలో మరో విక్టరీ
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగాల్ వారియర్స్ నాలుగో విజయం సాధించింది. తమిళ్ తలైవస్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 37-28 తేడాతో జయకేతనం ఎగురవేసింది. బెంగాల్ వారియర్స్ జట్టులో మనీందర్ సింగ్ సూపర్ 10 సాధించాడు.
మొత్తం అతని ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. మిగతా వారిలో అమిత్ 5, రాన్ సింగ్ 4, దర్శన్, ఆకాశ్, నబీబక్ష్ రెండేసి వికెట్లు పాయింట్లు సాధించారు. ఇక తమిళ్ తలైవస్ జట్టులో మంజీత్ 8 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో సుర్జిత్ సింగ్, భవాని రాజ్పుత్ ఐదేసి పాయింట్లు, సాగర్ 3, మోహిత్, అథల్ రెండేసి పాయింట్లు సాధించారు.
పుణె ఘనవిజయం
మరో మ్యాచ్లో యు ముంబాపై పుణేరి పల్టాన్ ఘన విజయం సాధించింది. వన్సైడేడ్గా ముగిసిన ఈ మ్యాచ్లో పుణే ఆటగాళ్లు చెలరేగడంతో ఏ దశలోనే ముంబై గెలిచేలా కనిపించలేదు. చివరకు యు ముంబాపై 23-42 పాయింట్ల భారీ తేడాతో పుణే ఘనవిజయం సాధించింది. ఆ జట్టులో నితిన్ తోమర్ 9, అస్లాం 7 పాయింట్లు సాధించారు. మోహిత్ గోయత్, విశాల్ భరద్వాజ్ ఐదేసి పాయింట్లు సాధించారు. అభినేష్ 4, బల్దేవ్ సింగ్ రెండు పాయింట్లు సాధించారు. ఇక యు ముంబా జట్టులో రాహుల్ 5, అభిషేక్ 4, అశిష్ కుమార్, మోహ్సేన్ మూడేసి, హరేంద్ర కుమార్, సింగ్, శివమ్ రెండేసి పాయింట్లు సాధించారు.
పాయింట్ల పట్టిక
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరేసి విజయాలతో పాట్నా పైరేట్స్ మొదటి స్థానంలో, బెంగళూరు బుల్స్ రెండో స్థానంలో ఉన్నాయి. ఇక 5 విజయాలతో దబాంగ్ ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. మూడు విజయాలతో నాలుగో స్థానంలో తమిళ్ తలైవస్ ఉంది. ప్రస్తుతం పాట్నా ఖాతాలో 34 పాయింట్లు, బెంగళూరు ఖాతాలో 33 పాయింట్లు, ఢిల్లీ ఖాతాలో 32, తమిళ్ తలైవస్ ఖాతాలో 27 పాయింట్లు ఉన్నాయి.
నేటి మ్యాచ్లు
జైపూర్ పింక్ పాంథర్స్ VS పాట్నా పైరేట్స్- రాత్రి 7:30 గంటలకు
గుజరాత్ జెయింట్స్ VS బెంగళూరు బుల్స్- రాత్రి 8:30 గంటలకు