న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుణే, యూపీ సూప‌ర్ విక్ట‌రీస్.. బెంగ‌ళూరు, బెంగాల్‌కు వ‌రుస ప‌రాజ‌యాలు

Puneri paltan Beat Bengal Warriors

బెంగ‌ళూరు: ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో ఆదివారం జ‌రిగిన రెండు మ్యాచ్‌లు కూడా వ‌న్ సైడెడ్‌గా ముగిశాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ బెంగాల్ వారియ‌ర్స్‌పై పుణెరి ప‌ల్టాన్ ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్‌లో బెంగ‌ళూరు బుల్స్‌పై యూపీ యోధ విజ‌యం సాధించింది.

చెల‌రేగిన అస్లామ్‌

చెల‌రేగిన అస్లామ్‌

బెంగాల్ వారియ‌ర్స్‌, పుణేరి ప‌ల్టాన్ మ్యాచ్‌లో పుణే రైడ‌ర్ ఇస్లామ్ చెల‌రేగ‌డంతో మ్యాచ్ అసాంతం పుణే వైపే మొగ్గు క‌నిపించింది. మ్యాచ్ ప్రారంభ‌మైన ఆరంభంలో బెంగాల్ జ‌ట్టు కాస్త అధిక్య‌త‌ను క‌న‌బ‌రిచింది. అయితే ఇంత‌లోనే పుంజుకున్న పుణే జ‌ట్టు వ‌రుస‌గా పాయింట్లు రాబ‌ట్టింది. బెంగాల్‌ను ఆలౌట్ చేసి ఫ‌స్టాప్ ముగిసే స‌మయానికి 20-11తో అధిక్యంలో నిలిచింది. సెకాండాఫ్‌లోనూ అధిప‌త్యం చెలాంయించిన పుణే జ‌ట్టు బెంగాల్‌ను మ‌రో సారి ఆలౌట్ చేసింది.

తద్వారా అధిక్యం మ‌రింత పెరిగింది. చివ‌ర్లో బెంగాల్ పుంజుకుని కాస్త అధిక్యాన్ని త‌గ్గించిన‌ప్ప‌టికీ మ్యాచ్‌లోకి రాలేక‌పోయింది. చివ‌ర‌కు మ్యాచ్‌ను పుణెరి ప‌ల్టాన్ జ‌ట్టు 39-27 తేడాతో గెలుచుకుంది. పుణె రైడ‌ర్ అస్లామ్ 17 పాయింట్ల‌తో స‌త్తా చాటాడు. బెంగాల్ జ‌ట్టులో రైడ‌ర్ మ‌నీంద‌ర్ సింగ్ 13 పాయింట్లు సాధించాడు. అక్ష‌య్ ఎనిమిది పాయింట్ల సాధించాడు. బెంగాల్ జ‌ట్టుకు ఇది వ‌రుస‌గా రెండో ప‌రాజ‌యం.

స‌త్తా చాటిన శ్రీ‌కాంత్

స‌త్తా చాటిన శ్రీ‌కాంత్

బెంగ‌ళూరు బుల్స్, యూపీ యోధా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో యూపీ ఆట‌గాడు శ్రీకాంత్ జాద‌వ్ స‌త్తా చాటాడు. దీంతో బెంగ‌ళూరుపై యూపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఏక ప‌క్షంగా సాగిన ఈ పోరులో యూపీ యోధా జ‌ట్టు 42-27 తేడాతో సుయాయ‌స విజ‌యం అందుకుంది. యూపీ జ‌ట్టులో శ్రీ‌కాంత్ జాద‌వ్ 15 పాయింట్ల‌తో స‌త్తా చాటాడు.

మిగ‌తా వారిలో సురేంద‌ర్ గిల్, మ‌హ్మ‌ద్ ఐదేసి పాయింట్లు సాధించారు. సుమిత్, గుర్‌దీప్ నాలుగేసి, నితీష్ కుమార్ 3 పాయింట్లు సాధించాడు. అటు బెంగ‌ళూరు జ‌ట్టులో 11 పాయింట్ల‌తో భ‌ర‌త్ స‌త్తా చాటాడు. మిగ‌తా వారిలో ప‌వ‌న్ కుమార్ 5 పాయింట్ల‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. మోహిత్ శ‌రావ‌త్, మోర్, చంద్ర‌న్ రంజిత్, అమ‌న్ రెండేసి పాయింట్లు సాధించారు. బెంగ‌ళూరు బుల్స్ గ‌త 5 మ్యాచ్‌ల్లో ఒక‌టే నెగ్గింది.

నేటి మ్యాచ్‌లు

నేటి మ్యాచ్‌లు

త‌మిళ్ త‌లైవ‌స్ VS హ‌ర్యాణా స్టీల‌ర్స్- రాత్రి 7:30 గంట‌ల‌కు

జైపూర్ పింక్ పాంథ‌ర్స్ VS ద‌బాంగ్ ఢిల్లీ- రాత్రి 8:30 గంట‌ల‌కు

Story first published: Monday, January 10, 2022, 8:42 [IST]
Other articles published on Jan 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X