
ప్రో కబడ్డీ జోష్
ప్రో కబడ్డీ పోటీల్లో భాగంగా బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై తెలగు టైటాన్స్ భారీ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.

ప్రో కబడ్డీ జోష్
ఆట ప్రారంభ నుండే జోరు చూపించిన తెలుగు టైటాన్స్ జట్టు బెంగాల్ వారియర్స్ని 44-28 స్కోరు తేడాతో ఓడించింది.

ప్రో కబడ్డీ
సొంత మైదానంలో తొలి విజయం సాధించిన తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు అఫేన్స్, డిఫేన్స్లో చక్కగా రాణించారు.

ప్రో కబడ్డీ
ప్రథమార్థంలోనే బెంగాల్ వారియర్స్ జట్టును 6వ నిమిషంలో ఆలౌట్ చేసింది. మళ్లీ ఆట 18వ నిమిషంలో మరోసారి ఆలౌట్ చేసి ప్రత్యర్థి జట్టుపై 27-9 ఆధీక్యతను సాధించింది.

ఆటగాళ్ల కరచాలనం
తెలుగు టైటాన్స్ ద్వితీయార్థంలో కూడా రాణించింది. బెంగాల్ వారియర్స్ జట్టులో మహేంద్రరాజ్ పరత్ మొత్తం 14 రైడింగ్ పాయింట్లు సాధించి టివిఎస్ బెస్ట్ రైడర్గా ఎంపికయ్యాడు.

సినీ నటుల జోష్
తెలుగు టైటాన్స్ జట్టు గురువారం పాట్నా పైరేట్స్తో తలపడనుంది.

వెంకటేష్ జోష్
కాగా, లీగ్లో కేవలం 11పాయింట్ల తో ఏడో స్థానానికి పడిపోయిన బెంగాల్ సెమీస్రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే.

జాతీయ గీతాలాపన
మ్యాచ్ ప్రారంభానికి ముందు టాలీవుడ్ ప్రముఖ గాయని గీతా మాధురి జాతీయ గీతాలాపనతో ప్రేక్షకులను అలరించింది.

జాతీయ గీతాలాపన
బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, కశ్యప్, టాలీవుడ్ నటులు వెంకటేష్, శ్రీకాంత్, అల్లరి నరేష్, మంచు లక్ష్మీప్రసన్నలు మ్యాచ్కు హాజరై టైటాన్స్ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.


Click it and Unblock the Notifications











