ఐపీఎల్కు ఏ మాత్రం తగ్గకుండా రోజురోజుకు ప్రో కబడ్డీ లీగ్కూ ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. సీజన్ 11 కోసం ఇటీవల నిర్వహించిన వేలంలో కబడ్డీ ఆటగాళ్లు రూ.కోట్ల ధర పలకడమే దానికి నిదర్శనం. ప్రతి సీజన్కు తన బ్రాండ్ వ్యాల్యూ పెంచుకుంటూ పీకేఎల్ దూసుకెళ్తోంది. ఈసారి ఆక్షన్లో రికార్డులు బద్దలవ్వడం మరో ప్రత్యేకత.
ఇటీవల రెండు రోజుల పాటు సాగిన ఈ వేలంలో 12 ఫ్రాంఛైజీలు కలిపి ఏకంగా 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే ఈ వేలంలో అరుదైన రికార్డు నెలకొంది. పీకేఎల్ చరిత్రలో అత్యధిక మంది ఆటగాళ్లు రూ.కోటికి పైగా ధర దక్కించుకున్న వేలంగా చరిత్రకెక్కింది. ఈ ఆక్షన్లో ఎనిమిది మంది ఆటగాళ్లు రూ.కోటిపైగా ధర పలకడం విశేషం.

భారీ ధర పలికిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..
సచిన్ తన్వార్ (తమిళ్ తలైవాస్- రూ.2.15 కోట్లు)
మహమ్మద్రెజా (హర్యానా స్టీలర్స్- రూ.2.07 కోట్లు)
గుమన్ సింగ్ (గుజరాత్ జెయింట్స్- రూ.1.97 కోట్లు)
పవన్ సెహ్రావత్ (తెలుగు టైటాన్స్- రూ.1.725 కోట్లు)
భరత్ (యూపీ యోధాస్- రూ.1.30 కోట్లు)
మణిందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్- రూ.1.15 కోట్లు)
అజింక్య పవార్ (బెంగళూరు బుల్స్- రూ.1.107 కోట్లు)
సునీల్ కుమార్ (యు ముంబా- రూ.1.015 కోట్లు)
మంజీత్ (యు ముంబా- రూ. 80 లక్షలు)
ప్రదీప్ నర్వాల్ (బెంగళూరు బుల్స్- రూ.70 లక్షలు)
క్రిషన్ ధుల్ (తెలుగు టైటాన్స్- రూ.70 లక్షలు)
శుభమ్ షిండే (పట్నా పైరేట్స్- రూ.70 లక్షలు)
సుర్జీత్ సింగ్ (జైపుర్ పింక్ పాంథర్స్- రూ.60 లక్షలు)
ఫజెల్ (బెంగాల్ వారియర్స్- రూ.50లక్షలు)