6-6, 8-8, 10-10 పాయింట్లతో సమం అవుతూ
నలుగురు రైడర్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరాటంలో యూపీ ఆటగాళ్లు ప్రశాంత్ కుమార్ రాయ్, శ్రీకాంత్ జాదవ్ సూపర్-10 సాధించారు. యూపీ తరఫున శ్రీకాంత్ 12, ప్రశాంత్ 11, నితీశ్ 4, నరేందర్ 3, రోహిత్ 2 పాయింట్లు సాధించగా, దబాంగ్కు నవీన్ 13, రంజిత్ 10, రాజేశ్ 3, విశాల్, విరాజ్, రవీందర్ తలా ఓ పాయింట్ సాధించారు. రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో స్కోర్లు 6-6, 8-8, 10-10 ఇలా సమం అవుతూ వెళ్లాయి.
చివర్లో పుంజుకున్న ఢిల్లీ జట్టు..
ఆ తర్వాత విజృంభించి ఆడిన యోధ ఆటగాళ్లు ఢిల్లీని రెండు సార్లు ఆలౌట్ చేసి తొలి అర్ధభాగం ముగిసేసరికి 25-17తో ఆధిక్యాన్ని సాధించారు. విరామం తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన యోధ ఓ దశలో 30-22తో నిలిచింది. అయితే చివర్లో పుంజుకున్న ఢిల్లీ జట్టు.. యోధను ఆలౌట్ చేసి 31-31తో స్కోరు సమం చేసింది.
ఢిల్లీ రైడర్ను పట్టేయడంతో యోధా గెలుపు
చివరి పది నిమిషాల ఆటలో రెండు జట్ల ఆటగాళ్లూ పోటీపడుతూ పాయింట్లు సాధించారు. దాంతో చివరి మూడు నిమిషాల ఆట మిగిలుండగా 35-35తో నిలిచిన రెండు జట్లు మ్యాచ్ను టైగా ముగించేలా కనిపించాయి. అయితే నవీన్ కుమార్ పాయింటు తెచ్చి ఢిల్లీకి ఆధిక్యాన్ని అందించాడు. చివరి నిమిషంలో ఒక పాయింటు ఆధిక్యంలో నిలిచిన ఢిల్లీ విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే అప్పుడే రైడ్కు వెళ్లిన శ్రీకాంత్ జాదవ్ రెండు పాయింట్లు తేవడం.. ఆ తర్వాత ఢిల్లీ రైడర్ను పట్టేయడంతో గెలుపు యోధ సొంతమైంది.
డిఫెన్స్తో పాటు బోనస్ పాయింట్లతో దుమ్మురేపి
మరో మ్యాచ్లో హర్యానా దూకుడు చూపెట్టింది. దీంతో లీగ్ మ్యాచ్లో 43-32తో పట్నా పైరేట్స్ను ఓడించింది. అద్భుతమైన డిఫెన్స్తో పాటు బోనస్ పాయింట్లతో దుమ్మురేపింది. హర్యానా తరఫున నవీన్ 12, వికాస్ 10, కుల్దీప్ 5, ప్రతీక్ 2 పాయింట్లు సాధించారు. పట్నా ఆటగాళ్లలో ప్రదీప్ నర్వాల్ 14, విజయ్ 7, వికాస్ 4, జైదీప్ 3 పాయింట్లు తీసుకొచ్చారు.