బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ 2021-2022లో భాగంగా తమిళ్ తలైవస్తో జరిగిన మ్యాచ్లో మాజీ ఛాంపియన్ పాట్నా పైరేట్స్ విధ్వంసం సృష్టించింది. ఏ దశలోనూ తమిళ్ తలైవస్కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్లో ఘన విజయం సాధించింది. రైడింగ్లోనూ, డిఫెన్స్లోనూ పాట్నా ఆటగాళ్లు చెలరేగారు. దీంతో మ్యాచ్ మొత్తంలో గెలుపు కలిసి కట్టుగా ఆడిన పాట్నా వైపే ఉంది. తమిళ్ తలైవస్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. దీంతో ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తమిళ్ తలైవస్పై పాట్నా పైరేట్స్ 52-24 తేడాతో ఘన విజయం సాధించింది. పాట్నా రైడర్లలో మోన్ గోయత్ 9, ప్రశాంత్ కుమార్ రాజ్ 8, సచిన్ 6 రైడ్ పాయింట్లతో సత్తా చాటారు. ఇక డిఫెండర్లు నీరజ్ కుమార్, షాద్లోయి ఆరేసి పాయింట్లు, సునీల్ 5 పాయింట్లు సాధించారు. చంద్రశేఖర్ 2 పాయింట్లు సాధించాడు.
ఇక తమిళ్ తలైవస్ జట్టులో సాగర్ 8, అజింక్య పవార్ 5, మంజీత్ 4, భవానీ రాజ్పుత్ 2, సుర్జీత్ సింగ్, సాగర్, హిమాన్సు తలో పాయింట్ సాధించారు. మొత్తంగా రైడ్ పాయింట్లు చూస్తే పాట్నా 21 సాధిస్తే, తమిళ్ తలైవస్ 14 సాధించింది. ఇక ట్యాకిల్ పాయింట్లలో పాట్నా 21 సాధిస్తే, తమిళ్ తలైవస్ 9 సాధించింది. మొత్తంగా ఈ మ్యాచ్లో పూర్తి అధిపత్యం చెలాయించిన పాట్నా పైరేట్స్ ఘన విజయాన్ని అందుకుంది. అటు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పాట్నా రెండో స్థానానికి చేరుకుంది. లీగ్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన పాట్నా పైరేట్స్ 8 విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు చేరువైంది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 45 పాయింట్లు ఉన్నాయి.
They came. They dominated. They conquered! 🔥
— ProKabaddi (@ProKabaddi) January 28, 2022
The Pirates sure deserve a 'Pat' on their back tonight 💯#PATvCHE #VIVOProKabaddi #SuperhitPanga @PatnaPirates pic.twitter.com/d3I0v7sXfC
ఇక ఈ మ్యాచ్లో ఓడిన తమిళ్ తలైవస్ పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో 34 పాయింట్లు ఉన్నాయి. ఈ సీజన్లో తమిళ్ తలైవస్ ఆడిన 13 మ్యాచ్ల్లో ఏకంగా 6 మ్యాచ్లు టైగా ముగియడం గమనార్హం. కాగా పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ చివరి స్థానంలో ఉంది. టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ మాత్రమే గెలిచిన టైటాన్స్ ఖాతాలో 22 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.