ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడవ సీజన్కు సర్వం సిద్దమయింది. పీకేఎల్-7 ఈనెల 20న ప్రారంభం కానున్న నేపథ్యంలో అభిమానుల్లో మరింత జోష్ నింపడానికి లీగ్ నిర్వాహకులు ఓ ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధం చేశారు. జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుల మధ్య ఆల్స్టార్ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వరల్డ్-7, ఇండియన్-7 జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. వరల్డ్-7 జట్టుకు ఫజల్ అట్రాచాలి, ఇండియన్-7 జట్టుకు అజయ్ ఠాకూర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ సీజన్లో మ్యాచ్లు రాత్రి 7.30కు ఆరంభమవుతాయి. ఇంతకు ముందు రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యేవి. ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి, సిద్దార్థ్ దేశాయ్, మోను గోయత్, సందీప్ నర్వాల్ వంటి పలువురు ఈ సీజన్లో కొత్త జట్లకు ఆడుతున్నారు. పర్దీప్ నర్వాల్, పవన్ కుమార్, అజయ్ ఠాకూర్, ఫజల్ వంటి ఆటగాళ్లు పాత జట్లకు ఆడుతున్నారు.
The #Panga just got 🔥🔥 with Kabaddi's strongest forces locking horns in the first-ever #VIVOProKabaddi All-Star match!
— ProKabaddi (@ProKabaddi) 11 July 2019
Don't miss all the high-voltage action as INDIA 7 take on WORLD 7, July 13, 7 PM onwards on Star Sports & Hotstar. pic.twitter.com/GaLVpSv7ih
బెంగళూరు బుల్స్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. గత సీజన్-6లో స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ నేతృత్వంలోని బెంగళూరు బుల్స్ విజేతగా నిలిచింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 38-33తో తేడాతో బెంగళూరు విక్టరీ సాధించి కప్ ఎగరేసుకుపోయింది. సీజన్-5లో కూడా గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది.
జట్లు:
ఇండియన్-7: మణీందర్, పవన్, రవీంద్ర పహాల్, వికాస్, సునీల్, దీపక్ హుడా, పర్దీప్ నర్వాల్, గిరీశ్, సుర్జీత్, అజయ్ ఠాకూర్ (కెప్టెన్), సందీప్ నర్వాల్, నితీశ్.
వరల్డ్-7: ఇస్మాయిల్, లాల్మనోహర్, గఫారి, టిన్ పోన్చో, షాజిద్, డాంగ్ యు కిమ్, జాంగ్ కున్ లీ, ఎమాద్, అబోజర్, ఫర్హాద్, ఫజల్, మసూర్ కరీమ్.