
హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్లో యు ముంబా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 33-23తో పుణెరి పల్టన్పై విజయం సాధించింది. కెప్టెన్ ఫజల్ (4), సందీప్ నర్వాల్ (4), సురీందర్ సింగ్ (4)లు డిఫెన్స్లో అద్భుత ప్రదర్శన చేయగా... రైడింగ్లో అభిషేక్ సింగ్ 5 పాయింట్లు సాధించాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
మ్యాచ్ ఆరంభం నుంచీ ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం పోటాపోటీగా తలపడ్డారు. 2-2తో ఉన్న సమయంలో శుభమ్ షిండే పాయింట్ తేవడంతో పుణె 3-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత డాంగ్ కాంగ్ లి, సందీప్ నర్వాల్ను పట్టేయడంతో పుణెరి పల్టన్ 5-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి ముంబా 5-5తో స్కోరు సమం చేసింది.
తొలి 12 నిమిషాల ఆట ముగిసే సరికి రెండు జట్లు 7-7తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత కీలక సమయంలో పుంజుకొన్న ముంబా 11-9తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో అర్ధభాగంలో ముంబా డిఫెండర్లు గొప్పగా పుంజుకున్నారు. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి జట్టుకు 15-10తో ఆధిక్యాన్ని అందించారు.
ఆ తర్వాత ముంబా రైడర్లు వరుసగా పాయింట్లు తేవడంతో 21-12తో నిలిచింది. చివరి తొమ్మిది నిమిషాల ఆట మిగిలి ఉందనగా మరోసారి పుణెరిని ఆలౌట్ చేసిన ముంబా 27-17తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ముంబా 33-23తో మ్యాచ్ను నెగ్గింది. పుణెరి జట్టులో సుర్జీత్ సింగ్ (6), పవన్ కడియాన్ (4) మెరిశారు.