హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ చాలారోజుల తర్వాత ఓ భారీ విజయం సాధించింది. సిద్ధార్థ్ దేశాయ్ రైడింగ్లో 22 పాయింట్లతో చెలరేగడంతో శుక్రవారం మ్యాచ్లో టైటాన్స్ 51-31 తేడాతో జైపుర్ పింక్ పాంథర్స్పై ఘన విజయం సాధించింది. మరో రైడర్ రజనీశ్ (11పాయింట్లు) కూడా సూపర్-10తో కదం తొక్కాడు.
గత ఐదు మ్యాచ్ల తర్వాత తెలుగు టైటాన్స్కు ఇదే తొలి విజయం. మ్యాచ్ ప్రారంభం నుంచి సిద్ధార్థ్ దేశాయ్ రెచ్చిపోవడంతో టైటాన్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 6-2తో ఆధిక్యాన్ని సంపాదించింది. అదే సమయంలో దీపక్ హుడా (12) రాణించడంతో జైపుర్ పాంథర్స్ తిరిగి పుంజుకుంది.
#JAIvHYD was fiercely fought, and ended with @Telugu_Titans shutting down @JaipurPanthers with a 20-point win!
— ProKabaddi (@ProKabaddi) September 27, 2019
Catch the Panchkula leg, LIVE:
⏲: Tomorrow, 7 PM onwards
📺 : Star Sports and Hotstar#IsseToughKuchNahi #VIVOProKabaddi pic.twitter.com/XmXbS3xden
తొలి అర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ 17-15పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. సిద్ధార్థ్ దేశాయ్ రైడింగ్లో బుల్లెట్లా దూసుకుపోయాడు. మరో నాలుగు నిమిషాలకే ఒకే రైడ్లో సిద్ధార్థ్ ముగ్గురిని ఔట్ చేయడంతో పాట్నా మరోసారి ఆలౌటైంది.
Give it up for Deepak Hooda 👏.
— ProKabaddi (@ProKabaddi) September 27, 2019
This silent threat just crossed 850 Raid Points in #VIVOProKabaddi with his efforts in #JAIvHYD tonight!
Catch him tearing up the mat:
⏲️: LIVE NOW
📺: Star Sports and Hotstar#IsseToughKuchNahi pic.twitter.com/igBoUX9Ifv
ప్రొ కబడ్డీలో శనివారం
హరియాణా స్టీలర్స్ vs యూపీ యోధ (రాత్రి 7:30 నుంచి)
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:30 నుంచి)