
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ చాలారోజుల తర్వాత ఓ భారీ విజయం సాధించింది. సిద్ధార్థ్ దేశాయ్ రైడింగ్లో 22 పాయింట్లతో చెలరేగడంతో శుక్రవారం మ్యాచ్లో టైటాన్స్ 51-31 తేడాతో జైపుర్ పింక్ పాంథర్స్పై ఘన విజయం సాధించింది. మరో రైడర్ రజనీశ్ (11పాయింట్లు) కూడా సూపర్-10తో కదం తొక్కాడు.
గత ఐదు మ్యాచ్ల తర్వాత తెలుగు టైటాన్స్కు ఇదే తొలి విజయం. మ్యాచ్ ప్రారంభం నుంచి సిద్ధార్థ్ దేశాయ్ రెచ్చిపోవడంతో టైటాన్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 6-2తో ఆధిక్యాన్ని సంపాదించింది. అదే సమయంలో దీపక్ హుడా (12) రాణించడంతో జైపుర్ పాంథర్స్ తిరిగి పుంజుకుంది.
తొలి అర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ 17-15పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. సిద్ధార్థ్ దేశాయ్ రైడింగ్లో బుల్లెట్లా దూసుకుపోయాడు. మరో నాలుగు నిమిషాలకే ఒకే రైడ్లో సిద్ధార్థ్ ముగ్గురిని ఔట్ చేయడంతో పాట్నా మరోసారి ఆలౌటైంది.
ప్రొ కబడ్డీలో శనివారం
హరియాణా స్టీలర్స్ vs యూపీ యోధ (రాత్రి 7:30 నుంచి)
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:30 నుంచి)