
ఆహ్మదాబాద్ ఇకా ఎరీనా స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్.. టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీ మధ్య బుధవారం తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రెండో సెమీస్లో బెంగాల్ వారియర్స్, యూ ముంబా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు శనివారం ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి.
సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 48-45 యూపీ యోధాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగగా.. బుల్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ షెరావత్ (20 పాయింట్లు) విజృంభించడంతో అదనపు సమయంలో బెంగళూరు సునాయాస విజయాన్ని అందుకుంది. యూపీ జట్టులో రైజర్లు రిశాంక్ దేవడిగ (11పాయింట్లు), శ్రీకాంత్ యాదవ్ (9పాయింట్లు) రాణించారు.
సోమవారం జరిగిన రెండో ఎలిమినేటర్లో యూ ముంబా 46-38తో హర్యానా స్టీలర్స్పై సునాయాస విజయం సాధించింది. ముంబా తరుపున అభిషేక్ సింగ్ 16 రైడ్ పాయింట్లు, అర్జున్ దేశ్వాల్ 15 రైడ్ పాయింట్లు సాధించారు. హర్యానా తరపున వికాస్ ఖండోల 12 రైడ్ పాయింట్లు చేసినా.. అతనికి సహకారం అందించేవారు లేక ఓటమిని చవిచూసింది.
Teams (Possible 7s):
Dabang Delhi: Joginder Narwal, Ravinder Pahal, Naveen Kumar, Chandan Ranjit, Vishal Mane, Meraj Sheykh, Vijay
Bengaluru Bulls: Pawan Sehrawat, Rohit Kumar, Sumit Singh, Mahender Singh, Amit Sheoran, Saurabh Nandal, Mohit Sehrawat
Bengal Warriors: Maninder Singh, Mohammad Nabibakshsh, Rinku Narwal, Sukesh Hegde, K Prapanjan, Jeeva Kumar, Baldev Singh
U Mumba: Fazel Atrachali, Abhishek Singh, Arjun Deshwal, Surinder Singh, Harendra Kumar, Sandeep Narwal, Athul MS