ఆహ్మదాబాద్: ప్రొకబడ్డీ లీగ్ సీజన్-7 తుది అంకానికి చేరింది. జూలై 20న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మొదలైన ఏడో సీజన్ విజయవంతంగా లీగ్ దశను ముగించింది. ఇప్పుడు ప్లే ఆఫ్స్, సెమీస్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మూడు నెలల పాటు హోరాహోరీగా సాగిన లీగ్ మ్యాచ్ల్లో అత్యున్నతంగా ఆడిన ఆరు జట్లు నాకౌట్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
25 wins, 1 loss: ఆసీస్ రికార్డు బద్దలు, సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా
ప్లేఆఫ్స్లో భాగంగా ఆహ్మదాబాద్ ఇకా ఎరీనా స్టేడియంలో రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు సోమవారం జరుగనున్నాయి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన యూపీ యోధా.. ఆరో స్థానంలో ఉన్న బెంగళూరు బుల్స్ మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇక రెండో ఎలిమినేటర్లో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న యు ముంబా.. ఐదవ స్థానంలో ఉన్న హర్యానా స్టీలర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రోజు రాత్రి మొదటగా యూపీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
అక్టోబర్ 16వ తేదీన సెమీఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. మొదటి ఎలిమినేటర్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న ఢిల్లీ దబాంగ్తో తొలి సెమీస్లో తలపడుతుంది. ఇక రెండో ఎలిమినేటర్లోని విజేత జట్టు.. బెంగాల్ వారియర్స్ను రెండో సెమీస్ మ్యాచ్లో ఢీకొంటుంది. సెమీస్ విజేతల మధ్య ఈ నెల 19న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
లీగ్-7లో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. గతంలో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ దశను నిర్వహించారు. ఈసారి గ్రూపులు లేవు. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ జరిగింది. ప్రతి జట్టు మిగతా 11 జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడింది. ప్రొ కబడ్డీ లీగ్-7ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో ముగించింది. మొత్తం మీద 22 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ 6 విజయాలతో 11వ స్థానంలో నిలిచింది. 4 విజయాలతో తమిళ్ తలైవాస్ అట్టడుగున ఉంది.