మ్యాచ్ ఆరంభంలో 4-0తో ఆధిక్యంలో
మ్యాచ్ ఆరంభంలో 4-0తో ఆధిక్యంలో నిలిచి బెంగాల్ ఆధిపత్యం ప్రదర్శించింది. రైడింగ్కు తోడు డిఫెన్స్లో పాయింట్లు కొల్లగొడుతూ ముందుకు సాగింది. ముఖ్యంగా ప్రపంజన్ తన తొమ్మిది రైడ్లలో ఆరు పాయింట్లు దక్కించుకున్నాడు. ఈ సమయంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన అజింక్యా పవార్ బెంగాల్కు నాలుగు పాయింట్లు అందించాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి బెంగాల్ 14-10తో ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో
ఇక, రెండో అర్ధభాగంలో జైపూర్ వెనుదిరిగి చూడలేదు. బెంగాల్ను ఒత్తిడిలోకి నెడుతూ వరుసగా పాయింట్లను సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్ 25వ నిమిషానికి పాంథర్స్ 15-16 చేరుకుంది. అదే దూకుడు కొనసాగించిన ఆ జట్టు మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 24-20తో విజయం దిశగా సాగింది.
మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో
మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో బెంగాల్ ఆలౌట్ కావడం పాంథర్స్కు కలిసి వచ్చింది. సందీప్ ధూల్ (8) ట్యాక్లింగ్లో మెరివడంతో చివరి నిమిషంలో బెంగాల్ను ఆలౌట్ చేసి 26-24తో జైపుర్ ఆధిక్యంలోకి దూసుకెళ్లి మ్యాచ్ను దక్కించుకుంది. ఈ మ్యాచ్ ద్వారా మణిందర్సింగ్ 450వ రైడ్ పాయింట్ నమోదు చేసుకోగా, సందీప్ దల్ డిఫెన్స్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు.
ప్రొ కబడ్డీలో ఆదివారం
ఢిల్లీ × హర్యానా (రాత్రి 7:30 నుంచి)
యు ముంబా × బెంగళూరు (రాత్రి 8:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్లో ప్రసారం