
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్కు మరో ఓటమి. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 31-25 తేడాతో తెలుగు టైటాన్స్ను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి 11-18తో వెనుకబడ్డ టైటాన్స్, రాహుల్ చౌదరి ప్రతిభతో పుంజుకుని 15-19తో ప్రత్యర్థిని చేరుకునే ప్రయత్నం చేసింది.
అయితే, ఆ తర్వాత తమిళ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. డిఫెండర్ మంజిత్ చిల్లర్, రైడర్ అజయ్ ఠాకూర్ అద్భుతంగా రాణించడంతో తలైవాస్ సునాయాసంగా గెలిచింది. ఈ ఇద్దరూ తలో ఏడు పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 37-27తో యూపీ యోధాపై నెగ్గింది.
మంగళవారం ప్రో కబడ్డీ లీగ్కు విరామం.
ప్రో కబడ్డీ లీగ్లో బుధవారం
హరియాణా స్టీలర్స్ vs పుణేరీ పల్టన్,
బెంగళూరు బుల్స్ vs తెలుగు టైటాన్స్