మోను గోయత్ - రూ.1.51 కోట్లు
మోను గోయత్ రైడర్గా ఓ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ మోను అందరి కంటే ఖరీదైన ఆటగాడిగా పేరొందాడు. గతేడాది పట్నా పైరేట్స్ జట్టు తరపున ఆడిన గోయత్ను ఈ ఏడాది హర్యానా స్టీలర్స్ జట్టు కొనుగోలు చేసింది.
రాహుల్ చౌదరి - రూ.1.28 కోట్లు
హర్యానా ఆటగాడు రాహుల్ చౌదరి తొలి రోజు వేలంలో అధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ రైడర్ను తెలుగు టైటాన్స్ జట్టు రూ.1.28 కోట్లు ఇచ్చి అట్టి పెట్టుకుంది.
నితిన్ తోమర్ - రూ.1.15 కోట్లు
రైడర్ నితిన్ తోమర్ గతేడాది లీగ్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రూ.93 లక్షలకు యూపీ యోధా జట్టుకు సొంతమైయ్యాడు. అయితే జట్టులో మార్పు చోటు చేసుకుని పుణెరి పల్టాన్ ఇతణ్ని రూ.1.15 కోట్లకు కొనుగోలు చేసింది.
దీపక్ నివాస్ హుడా - రూ.1.15 కోట్లు
పుణెరి పల్టాన్ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ నివాస్ హుడాను అతణ్ని జట్టు అంటిపెట్టుకోలేదు. దీంతో ఈ ఆల్రౌండర్ను వేలానికి వదిలేయడంతో పట్నా పైరేట్స్ రూ.1.15 కోట్లకు కొనుగోలు చేసింది.
రిషాంక్ దేవడిగ - రూ.1.11 కోట్లు
కూతకెళ్తే పాయింట్ పట్టినట్లే.. ఈ రైడర్ అలాంటి యోధుడైన రిషాంక్ దేవాడిగాను యూపీ యోధా రూ.1.11కోట్లకు కొనుగోలు చేసింది.
ఫజెల్ అత్రాచలి - రూ.1 కోటి
ఫజెల్ అత్రాచలి ప్రొ కబడ్డీ వేలంలో కోటి రూపాయలు పలికిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని ప్రారంభ ధర రూ.20లక్షల నుంచి క్రమంగా పెరుగుతూ రావడంతో యూ ముంబా రూ. కోటి ఇచ్చి సొంతం చేసుకుంది. కాగా, ఇప్పటి వరకూ అంటి పెట్టుకున్న ఆటగాళ్లను మినహాయిస్తే వేలంలో అధిక ధర పలికిన ఆటగాళ్లలో ఫజెల్ అత్రాచలి టాప్ 1 స్థానంలో ఉన్నాడు.