పుణె: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగళూరు బుల్స్ జోరును కొనసాగిస్తోంది. లీగ్లో భాగంగా బుధవారం జరిగిన రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకున్న బెంగళూరు బుల్స్... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మరో విజయాన్ని నమోదు చేసింది. లీగ్ మ్యాచ్లో 42-34తో హర్యానా స్టీలర్స్పై గెలిచింది. స్టీలర్స్ డిఫెన్స్ను చెదరగొడుతూ బుల్స్ ఆటగాళ్లు పవన్ షెర్వాత్ (21), రోహిత్ (8), మహేందర్ (2) కాశీలింగ్ (2) రైడింగ్లో చెలరేగిపోయారు.
వికాశ్ (14), మోను గోయట్ (11), ప్రవీణ్ (3) హర్యానాకు పాయింట్లు అందించారు. ఓ దశలో బుల్స్ 3-5తో వెనుకబడినా.. రోహిత్ రైడింగ్తో 5-5తో స్కోరు సమం చేసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి హర్యానా 15-13 ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో పవన్ సూపర్ రైడింగ్తో ఆకట్టుకున్నాడు. చకచకా పాయింట్లు సాధించడంతో 21-17 ఆధిక్యంలోకి వెళ్లింది.
మరోసారి పరాజయానికి గురైన తెలుగు టైటాన్స్
అదే జోరుతో ఆధిక్యాన్ని 26-18, 32-23తో పెంచుకుంటూ పోయింది. చివర్లో ఐదు నిమిషాల వ్యవధిలో 8 పాయింట్లు సాధించడంతో విజయం సొంతమైంది. మరో మ్యాచ్లో యూపీ యోధా 29-23తో పుణెరి పల్టాన్పై గెలిచింది. పుణె తరఫున మోను 7, నితిన్ 5, రవి 3 పాయింట్లు సాధించగా, యూపీకి ప్రశాంత్ 8, శ్రీకాంత్ 6, రిషాంక్ 4 పాయింట్లు అందించారు.
గురువారం విశ్రాంతి దినం కావడంతో.. గురువారం జరిగే పోటీల్లో పట్నాతో జైపూర్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్ 32 పాయింట్లతో లీగ్ పట్టికలో టాప్ లో ఉండగా.. ఆఖర్లో పింక్ పాంథర్స్ కేవలం 7పాయింట్లతో కొనసాగుతోంది.