హర్యాణాపై గుజరాత్ గెలుపు
హర్యాణా స్టీలర్స్పై గుజరాత్ జెయింట్స్ 32-26 తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జట్టులో అజయ్ కుమార్ (11), ప్రదీప్ కుమార్ (10) సూపర్ 10లతో సత్తా చాటారు. ప్రవేశ్, గిరీష్ మూడేసి పాయింట్లు సాధించారు. రవీందర్, హడీ తలో పాయింట్ సాధించారు. హర్యాణా జట్టులో మీట్ 8, వికట్ 7 పాయింట్లు సాధించారు. రోహిత్ గుల్లా 4 పాయింట్లు సాధించగా.. జైదీప్ రెండు ట్యాకిల్ పాయింట్లు సాధించారు. ఈ ట్యాకిల్ పాయింట్లతో కెరీర్లో జైదీప్ 50 పాయింట్లు సాధించిన డిఫెండర్గా నిలిచాడు. మోహిత్, విజయ్, అంకిత్ తలో పాయింట్ సాధించారు. కాగా టోర్నీలో గుజరాత్ జెయింట్స్కు ఇది నాలుగో విజయం.
ఢిల్లీ గెలుపు
మరో మ్యాచ్లో యు ముంబాపై దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. 36-30 పాయింట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ మొత్తం హోరాహోరీగా సాగినప్పటికీ చివర్లో ఢిల్లీ అధిక్యత కనబరిచింది. ఆరంభంలో నువ్వా నేనా అన్నట్లు తలపడడంతో ఫస్టాప్ ముగిసే సమయానికి 19-19 తో స్కోర్లు సమంగా నిలిచాయి. ఢిల్లీ జట్టులో విజయ్ మాలిక్(12) సూపర్ 10తో సత్తా చాటాడు.
మిగతా వారిలో అశు మాలిక్ 8, నీరజ్ నర్వాల్ 6, మంజీత్ చిల్లర్ 4, సందీప్ నర్వాల్ 2, జోగిందర్ ఒక పాయింట్ సాధించారు. ఇక యుముంబా జట్టులో అభిషేక్ సింగ్ 8, శివమ్ 6, అజిత్, హరేంద్ర కుమార్, అజిత్ కుమార్, ఫజేల్ మూడేసి పాయింట్లు సాధించారు. రింక్ ఒక పాయింట్ సాధించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ తొలి స్థానానికి చేరుకుంది.
పాయింట్ల పట్టిక
పాయింట్ల పట్టికలో 9 విజయలు 53 పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. 8 విజయాలు 46 పాయింట్లతో బెంగళూరు బుల్స్ రెండో స్థానంలో ఉంది. 8 విజయాలు, 45 పాయింట్లతో పాట్నా పైరేట్స్ మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఉన్న హర్యాణా స్టీలర్స్ ఖాతాలో 6 విజయాలు, 43 పాయింట్లు ఉన్నాయి. ఇక టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్క విజయం సాధించిన తెలుగు టైటాన్స్ 22 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది.
నేటి మ్యాచ్లు
బెంగాల్ వారియర్స్ VS గుజరాత్ జెయింట్స్- రాత్రి 7:30 గంటలకు
బెంగళూరు బుల్స్ VS యూపీ యోధా - రాత్రి 8:30 గంటలకు