న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pro Kabaddi: చెల‌రేగిన ప్ర‌దీప్ న‌ర్వాల్‌, ప‌వ‌న్‌.. సెమీఫైన‌ల్‌లో యూపీ యోధా, బెంగ‌ళూరు బుల్స్‌

Pro Kabaddi 2022: Bengaluru Bulls and UP yodha reach semi finals after beating and Gujarat Giants and Puneri Paltan

బెంగ‌ళూరు: ప్రొక‌బ‌డ్డీ లీగ్ 2021-2022లో యూపీ యోధా, బెంగ‌ళూరు బుల్స్ సెమీఫైన‌ల్ చేరాయి. నేడు జ‌రిగిన మొద‌టి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో పుణేరి ప‌ల్టాన్‌ను యూపీ యోధా ఓడించ‌గా.. రెండో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌ను బెంగ‌ళూరు బుల్స్ ఓడించింది. యూపీ జట్టులో ప్ర‌దీప్ న‌ర్వాల్ చెల‌రేగాడు. బెంగ‌ళూరు జ‌ట్టులో ప‌వ‌న్ కుమార్ స‌త్తా చాటాడు.

చెల‌రేగిన ప్ర‌దీప్ న‌ర్వాల్‌

నేడు యూపీ యోధా, పుణేరి ప‌ల్టాన్ మ‌ధ్య జ‌రిగిన తొలి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో యూపీ రైడ‌ర్ ప్ర‌దీప్ న‌ర్వాల్ చెల‌రేగాడు. దీంతో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్‌ను ఓడించి యూపీ యోధా సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. పుణేరి ప‌ల్టాన్‌పై యూపీ యోధా 42-31 పాయింట్ల తేడాతో విజ‌యం సాధించింది. యూపీ జ‌ట్టులో రైడ‌ర్ ప్ర‌దీప్ న‌ర్వాల్ 18 పాయింట్ల‌తో చెల‌రేగాడు. మిగ‌తా వారిలో సురేంద‌ర్ గిల్, సుమిత్ ఐదేసి పాయింట్లు సాధించారు. నితీష్ కుమార్ 3 పాయింట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. అశు సింగ్, గుర్దీప్, శ్రీ‌కాంత్ జాద‌వ్ త‌లో పాయింట్ సాధించారు. ఇక పుణే జ‌ట్టులో అస్లాం సూప‌ర్ 10 సాధించాడు. మిగ‌తా వారిలో ఆశాశ్ షిండే 7, మెహిత్ గోయ‌త్ 4, సోంబిర్ 3, హాడి తాజిక్ 2, అభినేష్, విశాల్ భ‌రద్వాజ్ త‌లో పాయింట్ సాధించారు.

సెమీస్‌లో బెంగ‌ళూరు

రెండో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌ను బెంగ‌ళూరు బుల్స్ ఓడించింది. గుజ‌రాత్‌ను 49-29 పాయింట్ల తేడాతో ఓడించి బెంగ‌ళూరు సెమీ ఫైన‌ల్స్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్ మొత్తం అధిప‌త్యం సాగించిన బెంగ‌ళురు బుల్స్ ఏ ద‌శ‌లోనూ ప్ర‌త్య‌ర్థికి అవ‌కాశం ఇవ్వ‌లేదు. వ‌రుస‌గా పాయింట్లు సాధిస్తూ గుజ‌రాత్ జెయింట్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. బెంగ‌ళూరు జ‌ట్టులో ప‌వ‌న్ కుమార్ 13 పాయింట్ల‌తో స‌త్తా చాటాడు. మిగ‌తా వారిలో చంద్ర‌న్ రంజిత్ 7, భ‌ర‌త్ 6, మ‌హేంద్ర సింగ్ 5, సౌర‌వ్ నంద‌ల్‌, ఆమ‌న్ నాలుగేసి పాయింట్లు, మ‌యూరు క‌డమ్ ఒక పాయింట్ సాధించారు. ఇక గుజ‌రాత్ జ‌ట్టులో రాకేష్ 8 పాయింట్లు సాధించ‌గా.. మ‌హేంద్ర గ‌ణేష్ రాజ్‌పుత్ 5, ప్ర‌దీప్ కుమార్ 4, ప్ర‌వేశ్ బైస్వాల్ 3, అజ‌య్ కుమార్, సునీల్ కుమార్ రెండేసి, హ‌డి ఒక పాయింట్ సాధించారు.

సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లు

సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లు

ఇక ప్రొక‌బ‌డ్డీ లీగ్‌లో నేటితో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నెల 23వ తేదీన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. పాట్నా పైరేట్స్‌, యూపీ యోధా, బెంగ‌ళూరు బుల్స్‌, ద‌బాంగ్ ఢిల్లీ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ల్లో గెలిచి సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాయి. తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌, యూపీ యోధా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో బెంగ‌ళూరు బుల్స్‌, ద‌బాంగ్‌ ఢిల్లీ అమితుమీ తేల్చుకోనున్నాయి. సెమీఫైన‌ల్‌లో గెలిచి ఫైన‌ల్ చేరిన రెండు జ‌ట్ల మ‌ధ్య ఈ నెల 25వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Story first published: Monday, February 21, 2022, 22:42 [IST]
Other articles published on Feb 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X