యు ముంబాకు షాకిచ్చిన హర్యానా స్టీలెర్స్
ఇక, చెన్నై అంచెలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్లో యు ముంబాకు హర్యానా స్టీలెర్స్ షాకిచ్చింది. సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 30-27తో యు ముంబాను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో డిఫెన్స్ తప్పిదాలతో ముంబా మూల్యం చెల్లించుకుంది.
5 పాయింట్లతో చెలరేగిన సందీప్ నర్వాల్
ఆట చివరలో హర్యానా పుంజుకోవడంతో మ్యాచ్ సొంతం చేసుకుంది. ముంబా ఆల్రౌండర్ సందీప్ నర్వాల్ కేవలం 5 పాయింట్లు సాధించాడు. దీంతో చెన్నై అంచెలో అర్ధభాగం మ్యాచ్లు ముగిశాయి. చెన్నై అంచె తొలి అర్ధభాగం ముగిసే సరికి అత్యధిక రైడ్ పాయింట్లు, అత్యధిక ట్యాకిల్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల వివరాలను ఒక్కసారి చూద్దాం...
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్కు ఇద్దరు కెప్టెన్లు
పవన్ కుమార్ షెరావత్
బెంగళూరు బుల్స్కు చెందిన పవన్ కుమార్ షెరావత్ 98 రైడ్ పాయింట్లతో జాబితాలో అగ్రస్థానంలొ కొనసాగుతున్నాడు. నవీన్ కుమార్ (దబాంగ్ ఢిల్లీ - 75 రైడ్ పాయింట్లు), సిద్ధార్ధ్ దేశాయ్(తెలుగు టైటాన్స్ - 68 పాయింట్లు), పరదీప్ నర్వాల్(పట్నా పైరెట్స్-64 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
యాషెస్ మూడో టెస్టుకూ అండర్సన్ దూరం.. మొయిన్ అలీకి నిరాశే!!
https://telugu.mykhel.com/cricket/ashes-2019-james-anderson-left-out-as-england-name-unchanged-squad-for-3rd-test-022926.html
సందీప్ కుమార్ ధుల్
జైపూర్ పింక్ ఫాంథర్స్కు చెందిన సందీప్ కుమార్ ధుల్ 31 ట్యాకిల్ పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సుమీత్ (యుపి యోధా- 30 ట్యాకిల్ పాయింట్లు), విశాల్ భరద్వాజ్(తెలుగు టైటాన్స్-29), జైదీప్(పట్నా పైరెట్స్-26 పాయింట్ల) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.