హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం గుజరాత్ ఫార్చూన్జెయింట్స్, బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు ఈ మ్యాచ్ 30-30తో టైగా ముగిసింది. తొలి ఐదారు నిమిషాల వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగినప్పటికీ.. తర్వాత బెంగళూరు జట్టు ఆధిపత్యం చెలాయించింది. ఆ జట్టు విరామ సమయానికి 18-12తో ఆధిక్యంలో నిలిచింది.
ఐతే ద్వితీయార్ధంలో గుజరాత్ పుంజుకుని బెంగళూరును అందుకుంది. 33వ నిమిషంలో 26-26తో స్కోరు సమమైన దగ్గర్నుంచి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివర్లో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ టైగా ముగిసింది. గుజరాత్ రైడర్ సచిన్ 10 పాయింట్లతో మ్యాచ్లో టాప్స్కోరర్గా నిలిచాడు. బెంగళూరు జట్టులో పవన్ 8 రైడ్ పాయింట్లు సాధించాడు.
లీగ్లో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. బెంగాల్ వారియర్స్ 26-22తో పుణేరీ పల్టన్స్పై గెలిచింది. గత రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన బెంగాల్ ఈ మ్యాచ్లో చెలరేగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 18-19తో వెనుకబడి ఉన్న బెంగాల్... రైడర్ మణీందర్ (6 పాయింట్లు) చెలరేగడంతో అనూహ్యంగా పుంజుకొని గెలుపొందింది.
పల్టన్స్ తరఫున జీబీ మోరె 9 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 30-30తో టైగా ముగిసింది. ఆదివారం జరగనున్న మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో యూపీ యోధా తలపడతాయి.