హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా నాగ్ పూర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 40-20తో యూపీపై ఘన విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో బెంగాల్ ఆటగాళ్లు వినోద్ కుమార్ (8), జాంగ్ కున్ లీ (7), మణిందర్సింగ్ (6) బెంగాల్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.
యూపీ ఆటగాళ్లు బెంగాల్కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. యోధా తరుపున సురేందర్సింగ్ (5 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. బెంగాల్ 22 రైడ్, 9 ట్యాకిల్, 6 ఆలౌట్, 3 అదనపు పాయింట్లు చేసింది. యూపీ యోధా 13 రైడ్, 4 ట్యాకిల్, 3 అదనపు పాయింట్లు మాత్రమే సాధించింది.