ఢిల్లీ: ప్రొకబడ్డీ లీగ్ సీజన్-7లో బెంగాల్ వారియర్స్ జట్టు గెలుపుబాట పట్టింది. గురువారం ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన మ్యాచ్లో బెంగాల్ 35-26తో తమిళ్ తలైవాస్పై సునాయాస విజయంను అందుకుంది. రైడింగ్లో వారియర్స్ ఆటగాళ్లు ప్రపంజన్ (10పాయింట్లు), మహీందర్ సింగ్ (9పాయింట్లు) సత్తా చాటగా.. రింకు నర్వాల్ (5పాయింట్లు) ట్యాక్లింగ్లో రాణించాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్: ధోనీకి దక్కని చోటు.. భువీకి విశ్రాంతి.. పాండ్యా పునరాగమనం
వరుస రైడ్ పాయింట్లతో తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ మంచి ఆరంభం ఇచ్చాడు. మ్యాచ్ 5-5 స్కోరుతో నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్న సమయంలో ప్రపంజన్ మాయ మొదలైంది. ప్రపంజన్ దాటికి తలైవాస్ జట్టు అనుభవజ్ఞులు మంజీత్ చిల్లార్, షబీర్ బాపు కోర్టు బయటే ఉన్నారు. ప్రపంజన్ మరింత దూకుడు పెంచడంతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన బెంగాల్ 11-7తో ఆధిక్యం సంపాదించింది. ఈ సమయంలో రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్, మంజీత్ చిల్లార్ ఫామ్ అందుకోవడంతో 14-15తో తలైవాస్ తొలి అర్ధ భాగాన్ని ముగించింది.
Leaping right to the 2⃣nd spot in the #VIVOProKabaddi points table!
— ProKabaddi (@ProKabaddi) August 29, 2019
A strong performance by the @BengalWarriors raiders made sure they got the better of @tamilthalaivas in #KOLvCHE tonight.
Were you a part of all the action on Star Sports & Hotstar? #IsseToughKuchNahi pic.twitter.com/2VGPfbZSQq
రెండో అర్ధ భాగంలో ప్రపంజన్ వరుస పాయింట్లు సాధించడంతో బెంగాల్ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. అయితే ఆనంద్ తమిళ తలైవాస్ను తిరిగి ఆటలోకి తీసుకురావడానికి సూపర్ రైడ్తో గట్టిగా పోరాడాడు. మరోవైపు అజయ్ ఠాకూర్ కూడా సూపర్-10 సాధించినా.. ప్రపంజన్ కూడా రెచ్చిపోవడంతో బెంగాల్ ఆధిక్యంను కొనసాగించింది. బెంగాల్ అదే ఊపులో మ్యాచ్ గెలిచింది. అజయ్ ఠాకూర్ (11) పోరాడినా తలైవాస్ విజయాన్ని అందుకోలేకపోయింది. 11 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో 39 పాయింట్లు సాధించిన బెంగాల్.. పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ రోజు టైటాన్స్ × పుణెరి, ఢిల్లీ × పట్నా జట్లు తలపడనున్నాయి.