హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ మరింత ఆసక్తికరంగా జరుగుతోంది. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే టోర్నీలో 53 మ్యాచ్లు ముగిశాయి. ఏడు విజయాలతో జైపుర్ పింక్ ఫాంథర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తప్పు మీరు చేస్తే డాలర్లు మేం చెల్లించాలా?: ఎన్డీటీఎల్ రద్దుపై బాత్రా నిప్పులు
కబడ్డీ మ్యాచ్లో రైడర్ పాత్ర ఎంతో కీలకం. ఆఖరు నిమిషంలో రైడర్లు మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసిన సందర్భాలను ఈ సీజన్లో ఎన్నో చూశాం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్కు చెందిన రైడర్ పవన్ కుమార్ షెరావత్ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్లు ఆడిన పవన్ కుమార్ షెరావత్ మొత్తం 103 రైడ్ పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, పట్నా పైరెట్స్కు చెందిన స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 77 రైడ్ పాయింట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
దబాంగ్ ఢిల్లీకి చెందిన నవీన్ కుమార్(75 పాయింట్లు), బెంగాల్ వారియర్స్కు చెందిన మణిందర్ సింగ్(68) పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. లీగ్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్ల్లో గుజరాత్-పట్నా, తమిళనాడు-ముంబై జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి.
ప్రక్షాళన: ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా హెసన్, హెడ్కోచ్గా కటిచ్
చెన్నై అంచెలో ఇదే చివరి లీగ్ మ్యాచ్లు కావడం విశేషం. రాత్రి 7.30 గంటలకు గుజరాత్ ఫార్చున్ జైయింట్స్ vs పట్నా పైరెట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా... రాత్రి 8.30 గంటలకు తమిళ తలైవాస్-యు ముంబా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై చెన్నై తలపడనున్న ఆఖరి మ్యాచ్ ఇదే.