హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ మళ్లీ వరుస విజయాలను నమోదు చేస్తోంది. గత మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిన పింక్ పాంథర్స్ ఆ షాక్ నుంచి త్వరగానే తేరుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 33-25తో పుణేరి పల్టన్ను ఓడించింది.
కోల్కతా నైట్రైడర్స్ కోచ్గా బ్రెండన్ మెక్కల్లమ్
జైపూర్ స్టార్ రైడర్ దీపక్ నివాస్ హుడా మరో సూపర్ 'టెన్'తో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. డిఫెండర్లు నితిన్ (4), సందీప్ (4) అతడికి సహకరించారు. ఇక, పుణే తరఫున పంకజ్ మోహిత్ 8 పాయింట్లతో మెరిశాడు. ఆట ఆరంభం దూకుడుగా ఆడిన జైపుర్ ఎక్కడా తడబాటుకు గురికాకుండా అద్భుతంగా ఆడింది.
ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదిస్తూ పుణె రైడర్లను కట్టడి చేసింది. దీంతో అటు రైడింగ్లోనూ, ఇటు డిఫెండింగ్లో తిరుగులేని ప్రదర్శన చేసింది. ఫలితంగా పుణేని ఆలౌట్ చేసి 17-11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. ఇక, రెండో అర్ధ భాగంలోనూ అదే దూకుడును కొనసాగించిన జైపుర్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
రోహిత్ శర్మతో కలిసి బుమ్రా, కోహ్లీని ఇమిటేట్ చేసిన జడేజా(వీడియో)
మొత్తం ఆరు మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన జైపుర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రో కబడ్డీలో శుక్రవారం మ్యాచులు ఇలా ఉన్నాయి.
యు ముంబ vs పట్నా - రాత్రి 7.30 నుంచి
గుజరాత్ vs జైపుర్ - రాత్రి 8.30 నుంచి