For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుమార్తెతో కలిసి మ్యాచ్‌కి హాజరైన ఐశ్యర్య: యు ముంబా చేతిలో జైపూర్‌ ఓటమి

Pro Kabaddi 2018 : U Mumba Fight Back To Down Jaipur Pink Panthers
PKL 2018: U Mumba fight back to down Jaipur Pink Panthers

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఆరో సీజన్‌లో యు ముంబా జట్టు బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో యు ముంబా జట్టు 39-32తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. అనూప్‌ కుమార్‌ చివరి సీజన్‌ వరకు యు ముంబా కెప్టెన్‌గా ఉన్నాడు. అంతేకాదు ఆ జట్టుని మూడుసార్లు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంతో పాటు ఓసారి టైటిల్‌ను అందించాడు.

అయితే, బుధవారం జరిగిన పోరులో మాత్రం అందుకు భిన్నం. ఈసారి ప్రత్యర్థిగా బరిలో దిగాడు. జోన్‌-ఎలో మాజీ ఛాంపియన్‌ల మధ్య ప్రొకబడ్డీ మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్టుగానే నువ్వానేనా అన్నట్టుగా సాగింది. అయితే ఆఖర్లో అదరగొట్టిన యు ముంబా లీగ్‌లో తొలి విజయాన్న నమోదు చేసింది. మ్యాచ్‌లో 39-32తో పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది.

13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర

13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర

చివర్లో దూకుడుగా ఆడిన సిద్ధార్థ్‌ దేశాయ్‌ 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి 5 నిమిషాల వరకు పాంథర్స్‌దే విజయమని అంతా భావించారు. అప్పటివరకు మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు 30-27తో ఆధిక్యంలో నిలిచింది. చివర్లో యు ముంబా ఆటగాళ్లు విజృంభించి జట్టుకు విజయాన్ని అందించారు.

తొలి అర్దభాగంలో 11-5తో స్పష్టమైన ఆధిక్యం

తొలి అర్దభాగంలో యు ముంబా జట్టును ఆలౌట్‌ చేసిన పాంథర్స్‌ జట్టు 11-5తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబా జట్టు అటాకింగ్‌పై దృష్టిసారిస్తే.. పాంథర్స్‌ డిఫెన్స్‌తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించింది. మ్యాచ్‌‌లో 30 నిమిషాల పాటు ఇలానే ఆడారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ దేశాయ్‌ దూకుడుగా ఆడటంతో పాంథర్స్ క్రమంగా అధిక్యాన్ని కోల్పోయింది.

మ్యాచ్‌ని తిలకించిన అభిషేక్‌ బచ్చన్‌ సతీమణి ఐశ్వర్యరాయ్‌

మ్యాచ్‌ని తిలకించిన అభిషేక్‌ బచ్చన్‌ సతీమణి ఐశ్వర్యరాయ్‌

యు ముంబా రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ (13 పాయింట్లు) అదరగొట్టాడు. రోహిత్‌ బలియన్‌ 7 పాయింట్లు సాధించాడు. పింక్‌పాంథర్స్‌ జట్టులో నితిన్‌ (8) రాణించాడు. అనూప్‌ 4, మోహిత్, సందీప్‌ ధుల్, అమిత్‌ తలా 3 పాయింట్లు చేశారు. ఈ మ్యాచ్‌ను జైపూర్‌ జట్టు యజమాని అభిషేక్‌ బచ్చన్‌ సతీమణి ఐశ్వర్యరాయ్‌ ఆసక్తిగా తిలకించారు.

బెంగళూరు బుల్స్‌ని ఓడించిన తమిళ్ తలైవాస్

బెంగళూరు బుల్స్‌ని ఓడించిన తమిళ్ తలైవాస్

జోన్‌-బిలో జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 48-37తో తమిళ్‌ తలైవాస్‌ను ఓడించి లీగ్‌లో శుభారంభం చేసింది. పవన్‌ షెరావత్‌ 20 పాయింట్లతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాశీలింగ్‌ అడకె 9 పాయింట్లు సాధించాడు. తలైవాస్‌ జట్టులో అజయ్‌ ఠాకూర్‌ (20) ఒంటరి పోరాటం వృథా అయ్యింది.

ప్రొకబడ్డీలో ఈరోజు

ప్రొకబడ్డీలో ఈరోజు

యూపీ యోధ × పట్నా పైరేట్స్‌

(రాత్రి 8 నుంచి)

తమిళ్‌ తలైవాస్‌ × బెంగాల్‌ వారియర్స్‌

(రాత్రి 9 నుంచి)

Story first published: Thursday, October 11, 2018, 9:01 [IST]
Other articles published on Oct 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+